ఆటో దొంగలించిన ఇద్దరు దొంగలను సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలోని దర్గా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా... ఇద్దరు వ్యక్తులు ఆటో, మోటార్ సైకిల్పై వచ్చారు. పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు.
నిందితులు దుండిగల్ తండాకు చెందిన రాకేశ్, ఎల్లారెడ్డిగూడెం తండాకు చెందిన సికిందర్గా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని విచారించగా... తాటి నవీన్కు చెందిన ఆటోను ఈ నెల 8వ తేదీ రాత్రి దొంగలించినట్లు ఒప్పుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిందితులను రిమాండుకు తరలించారు.