జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాసు పురం గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన చెందిన బోయ విజయ్(28) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శనివారం ఆయన పొలంలో పని చేస్తుండగా... మోటారు సర్వీసు తీగలు తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
విజయ్కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: దారుణం... ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి