జవహర్నగర్ ఇన్స్పెక్టర్ బిక్షపతిరావుపై దాడి ఘటనలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న జవహర్నగర్లోని సర్వే నెంబర్ 432లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు.. మున్సిపల్ అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన సీఐ బిక్షపతిరావుతోపాటు.. ఇతర పోలీసు సిబ్బందిపై పూనమ్ చంద్తోపాటు అతని కుటుంబ సభ్యులు కళ్లల్లో కారం చల్లుతూ దాడికి పాల్పడ్డారు.
ఆ ఘటనలో సీఐ బిక్షపతిరావు 40 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చూడండి : 14 ఫేక్ రుణాల యాప్లు.. అదుపులో నిందితులు