నల్గొండ జిల్లా తిరుమల గిరి మండలం కోంపెల్లిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల కాపరి కొప్పరి నర్సింహకు చెందిన 14 గొర్రె, మేక పిల్లలను వీధి కుక్కలు గాయపరచి చంపేశాయి. తన గొర్రె, మేక పిల్లలు చనిపోవడం వల్ల బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరిగినా.. పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోయారు. వీధికుక్కల నియంత్రణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం... ఇద్దరు యువకుల దుర్మరణం