ఇరాక్ దక్షిణ బగ్దాద్లోని అమెరికా బలగాల స్థావరానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. బాలాద్ ఎయిర్ బేస్కు సమీపంలో రెండు రాకెట్లతో దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. బలగాల ఉపసంహరణపై అమెరికా-ఇరాక్ చర్చలు జరపడానికి ముందు ఈ రాకెట్ దాడులు జరగడం గమనార్హం.
ఏప్రిల్ 7న ఇరాక్ ప్రభుత్వం అమెరికాతో నాలుగోసారి చర్చలు జరపనుంది. ట్రంప్ అధికారంలో ఉండగా గత ఏడాది జూన్లో చర్చలు ప్రారంభమయ్యాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరాక్లో ఉన్న అమెరికా బలగాల ఉపసంహరణ సహా ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి.
2011లో ఇరాక్ నుంచి బలగాలను అమెరికా ఉపసంహరించుకుంది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇరాక్ ప్రభుత్వం సహాయం కోరాగా.. 2014లో మళ్లీ బలగాలను మోహరించింది. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇరాక్లో అమెరికా బలగాల సంఖ్యను 2500లకు తగ్గించారు. మిగిలిన బలగాలను సైతం ఉపసంహరించే అంశంపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి.
ఇదీ చదవండి: హఫీజ్ అనుచరులకు 9 ఏళ్లు జైలు శిక్ష