ఇరాక్ ఉత్తర బగ్దాద్లో అమెరికా బలగాలు ఉన్న స్థావరంపై వరుస రాకెట్ దాడులు జరిగాయి. బాలాద్ ఎయిర్ బేస్పై రెండు రాకెట్లతో దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు ఇరాక్ భద్రతా దళ సిబ్బంది గాయపడ్డట్లు తెలిపారు. దాడి సమయంలో బాలాద్ ఎయిర్బేస్లో ఇద్దరు అమెరికా ట్రైనర్లు ఉన్నారని చెప్పారు.
ఇరాక్లోని అమెరికా దళాల లక్ష్యంగా జరుగుతున్న దాడుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే.. ఉత్తర ఇరాక్లోని ఓ ఎయిర్పోర్ట్లో అమెరికా నేతృత్వం వహిస్తున్న కూటమి బలగాలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడితో భారీగా మంటలు చెలరేగగా.. ఓ భవనం ధ్వంసమైంది.
2011లో ఇరాక్ నుంచి బలగాలను అమెరికా ఉపసంహరించుకుంది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇరాక్ ప్రభుత్వం సహాయం కోరాగా.. 2014లో మళ్లీ బలగాలను మోహరించింది. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇరాక్లో అమెరికా బలగాల సంఖ్యను 2500కు తగ్గించారు.
ఇదీ చదవండి: ఎస్యూవీ కాలువలోకి దూసుకెళ్లి 13 మంది మృతి
ఇదీ చదవండి: పబ్లో పేలిన తుపాకీ.. ముగ్గురు మృతి