ETV Bharat / international

ప్రణబ్​ మృతిపై అమెరికా, చైనా విచారం

author img

By

Published : Sep 1, 2020, 4:12 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మృతి పట్ల చైనా విచారం వ్యక్తం చేసింది. భారత్- చైనా స్నేహబంధానికి ఆయన మరణం తీరని లోటు అని పేర్కొంది. భారత్​-అమెరికా భాగస్వామ్యాన్ని ప్రణబ్​ ముఖర్జీ లోతుగా విశ్వసించారని డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ అన్నారు.

PRANAB CHINA
ప్రణబ్​ ముఖర్జీ

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మృతిపై అమెరికా, చైనా విచారం వ్యక్తం చేశాయి. ప్రణబ్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని​చైనా తెలిపింది. ఆయన ఎంతో అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడని కీర్తించిన పొరుగుదేశం.. భారత్​- చైనా స్నేహబంధానికి ప్రణబ్ మరణం భారీ నష్టమని స్పష్టం చేసింది.

ప్రణబ్​ ముఖర్జీకి చైనా తరఫున నివాళులు అర్పించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్​యింగ్​ తెలిపారు.

"మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపార అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. భారత్- చైనా సంబంధాల కోసం చాలా కృషి చేశారు. ఆయన మరణం రెండు దేశాల స్నేహబంధానికి భారీ నష్టం. ముఖ్యంగా భారత్​కు. భారత ప్రభుత్వానికి, ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం."

- హువా చున్​యింగ్​, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ 2014లో భారత్​ సందర్శించినప్పుడు ముఖర్జీతో భేటీ అయ్యారని చున్​యింగ్​ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం సంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.

అమెరికా భాగస్వామ్యాన్ని విశ్వసించారు..

అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్​, అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యాన్ని ముఖర్జీ విశ్వసించారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ అన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

  • President Shri Pranab Mukherjee was a devout public servant who believed deeply in the importance of our two nations tackling global challenges together. Jill and I are saddened to hear of his passing — our prayers go out to his loved ones and the Indian people. pic.twitter.com/SJfaDEKjGi

    — Joe Biden (@JoeBiden) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రజా సేవకుడు. మన రెండు దేశాలు కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉన్న ప్రాముఖ్యాన్ని లోతుగా విశ్వసించారు. ఆయన మరణ వార్త విని దిగ్ర్భాంతికి గురయ్యాం."

- జో బైడెన్​, డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి

ముఖర్జీ, బైడెన్​ మధ్య మంచి స్నేహ బందం ఉంది. అమెరికాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన భారతీయ నేతల్లో ముఖర్జీ ఒకరు. ఆయన మరణం పట్ల చాలా మంది అమెరికా నాయకులు విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ప్రణబ్​ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మృతిపై అమెరికా, చైనా విచారం వ్యక్తం చేశాయి. ప్రణబ్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని​చైనా తెలిపింది. ఆయన ఎంతో అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడని కీర్తించిన పొరుగుదేశం.. భారత్​- చైనా స్నేహబంధానికి ప్రణబ్ మరణం భారీ నష్టమని స్పష్టం చేసింది.

ప్రణబ్​ ముఖర్జీకి చైనా తరఫున నివాళులు అర్పించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్​యింగ్​ తెలిపారు.

"మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపార అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. భారత్- చైనా సంబంధాల కోసం చాలా కృషి చేశారు. ఆయన మరణం రెండు దేశాల స్నేహబంధానికి భారీ నష్టం. ముఖ్యంగా భారత్​కు. భారత ప్రభుత్వానికి, ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం."

- హువా చున్​యింగ్​, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ 2014లో భారత్​ సందర్శించినప్పుడు ముఖర్జీతో భేటీ అయ్యారని చున్​యింగ్​ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం సంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.

అమెరికా భాగస్వామ్యాన్ని విశ్వసించారు..

అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్​, అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యాన్ని ముఖర్జీ విశ్వసించారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ అన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

  • President Shri Pranab Mukherjee was a devout public servant who believed deeply in the importance of our two nations tackling global challenges together. Jill and I are saddened to hear of his passing — our prayers go out to his loved ones and the Indian people. pic.twitter.com/SJfaDEKjGi

    — Joe Biden (@JoeBiden) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రజా సేవకుడు. మన రెండు దేశాలు కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉన్న ప్రాముఖ్యాన్ని లోతుగా విశ్వసించారు. ఆయన మరణ వార్త విని దిగ్ర్భాంతికి గురయ్యాం."

- జో బైడెన్​, డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి

ముఖర్జీ, బైడెన్​ మధ్య మంచి స్నేహ బందం ఉంది. అమెరికాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన భారతీయ నేతల్లో ముఖర్జీ ఒకరు. ఆయన మరణం పట్ల చాలా మంది అమెరికా నాయకులు విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ప్రణబ్​ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.