ETV Bharat / international

న్యూజిలాండ్​లో ఎన్నికలు- మరోమారు జసిండా పాలనే! - కరోనా వైరస్​ న్యూజిలాండ్​

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. న్యూజిలాండ్​ ప్రజలు ఈ శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరోనాపై పోరులో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ప్రధాని జసిండా ఆర్డెర్న్​ మరోమారు ఎన్నికవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు గంజాయి, కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసేందుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణపైనా ఆ దేశ ప్రజలు ఓటు వేయనున్నారు.

New Zealand election: Ardern vs. conservative challenger
న్యూజిలాండ్​లో ఎన్నికలు- మరోమారు జసిండా పాలనే!
author img

By

Published : Oct 16, 2020, 5:20 AM IST

కరోనాను దృఢ సంకల్పంతో జయించి.. ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్న న్యూజిలాండ్​.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముస్తాబవుతోంది. దేశ ప్రజలు.. శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత ప్రధాని జసిండా ఆర్డెర్న్​ నేతృత్వంలోని లిబరల్​ లేబర్​ పార్టీతో కన్జర్వేటివ్​ నేషనల్​ పార్టీకి చెందిన కాలిన్స్​ బృందం పోటీపడనుంది. అయితే జసిండా ఆర్డెర్న్​.. మరోమారు ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనాపై పోరులో..

2019లో క్రైస్ట్​చర్చ్​ కాల్పుల ఘటనను ఎదుర్కొన్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు జసిండా. అయితే కరోనాపై పోరులో తన నాయకత్వంతో అందరినీ కట్టిపడేశారు జసిండా. ఇదే ఆమెకు అత్యంత సానుకూల అంశమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై జసిండా​ ప్రణాళికలు.. ఓటర్లను ఆకర్షిస్తాయని లేబర్​ పార్టీ విశ్వాసంతో ఉంది.

గంజాయి.. కారుణ్య మరణం..

సార్వత్రిక ఎన్నికలతో పాటు మరో రెండు కీలక విషయాలపై న్యూజిలాండ్ ​వాసులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. గంజాయి, కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం​)పై ఓటు వేయనున్నారు. కారుణ్యమరణానికి మద్దతు లభిస్తే.. అది వెంటనే చట్టంగా మారుతుంది. గంజాయిని చట్టబద్ధం చేయడానికి న్యూజిలాండ్​ వాసులు మద్దతునిచ్చినా.. అనంతరం ఆ దేశ పార్లమెంట్​లో అందుకు తగ్గ చట్టాన్ని ఆమోదించాల్సిందే.

ఇదీ చూడండి:- అరకోటి మందికి 'అమ్మ'గా ఆ దేశ ప్రధాని

కరోనాను దృఢ సంకల్పంతో జయించి.. ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్న న్యూజిలాండ్​.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముస్తాబవుతోంది. దేశ ప్రజలు.. శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత ప్రధాని జసిండా ఆర్డెర్న్​ నేతృత్వంలోని లిబరల్​ లేబర్​ పార్టీతో కన్జర్వేటివ్​ నేషనల్​ పార్టీకి చెందిన కాలిన్స్​ బృందం పోటీపడనుంది. అయితే జసిండా ఆర్డెర్న్​.. మరోమారు ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనాపై పోరులో..

2019లో క్రైస్ట్​చర్చ్​ కాల్పుల ఘటనను ఎదుర్కొన్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు జసిండా. అయితే కరోనాపై పోరులో తన నాయకత్వంతో అందరినీ కట్టిపడేశారు జసిండా. ఇదే ఆమెకు అత్యంత సానుకూల అంశమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై జసిండా​ ప్రణాళికలు.. ఓటర్లను ఆకర్షిస్తాయని లేబర్​ పార్టీ విశ్వాసంతో ఉంది.

గంజాయి.. కారుణ్య మరణం..

సార్వత్రిక ఎన్నికలతో పాటు మరో రెండు కీలక విషయాలపై న్యూజిలాండ్ ​వాసులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. గంజాయి, కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం​)పై ఓటు వేయనున్నారు. కారుణ్యమరణానికి మద్దతు లభిస్తే.. అది వెంటనే చట్టంగా మారుతుంది. గంజాయిని చట్టబద్ధం చేయడానికి న్యూజిలాండ్​ వాసులు మద్దతునిచ్చినా.. అనంతరం ఆ దేశ పార్లమెంట్​లో అందుకు తగ్గ చట్టాన్ని ఆమోదించాల్సిందే.

ఇదీ చూడండి:- అరకోటి మందికి 'అమ్మ'గా ఆ దేశ ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.