ETV Bharat / international

నేపాల్​ అగ్రనేతలతో చైనా బృందం భేటీ

author img

By

Published : Dec 28, 2020, 7:31 PM IST

నేపాల్​ కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయ సంక్షోభానికి తెర దించడానికి చైనా బృందం రంగంలోకి దిగింది. చైనా​ కమ్యూనిస్టు పార్టీ వైస్​ మినిస్టర్​ నేతృత్వంలో బృందం.. ఎన్​సీపీ అగ్రనేతలతో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు.

Nepal political crisis: Chinese delegation meets top NCP leaders Prachanda, Madhav Nepal
నేపాల్​ అగ్రనేతలతో చైనా మినిస్టర్​ బృందం భేటీ

నేపాల్​లో కమ్యూనిస్ట్​ పార్టీ చీలిపోకుండా ఆపడానికి, నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈక్రమంలో మరోసారి నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఉన్నత స్థాయి అధికారులు. ఈ సమావేశంలో నేపాల్​లోని రాజకీయ సంక్షోభంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్​లో నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించే దిశగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఆదివారం నేపాల్​ చేరుకున్న చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వైస్ మినిస్టర్​ గువో యెజౌ నేతృత్వంలోని బృందం.. పుష్ప కుమార్​ దహల్ ప్రచండతో భేటీ అయ్యింది. అనంతరం మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్​ను కలిసింది.

గువో బృందం.. అధ్యక్షుడు విద్యా దేవి భండారి, ప్రధానమంత్రి ఓలిలతో ఆదివారం వేర్వేరుగా భేటీ అయినట్లు మై రిపబ్లికా వార్తా పత్రిక పేర్కొంది. ఈ విషయాన్ని ఆయా కార్యాలయాలు ధ్రువీకరించాయి. అయితే సమావేశాల్లో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేదని వార్తా పత్రిక తెలిపింది.

నేపాల్​లోని ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్(ఎన్​సీ) అగ్రనేతలతో కూడా గువో బృందం సమావేశం కానున్నట్లు సమాచారం. పార్లమెంటు రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ఎన్​సీ.. ప్రజాప్రతినిధుల సభను పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తోంది.

ఇదీ చూడండి: నేపాల్​ రాజకీయాల్లో మరోసారి చైనా జోక్యం!

నేపాల్​లో కమ్యూనిస్ట్​ పార్టీ చీలిపోకుండా ఆపడానికి, నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈక్రమంలో మరోసారి నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఉన్నత స్థాయి అధికారులు. ఈ సమావేశంలో నేపాల్​లోని రాజకీయ సంక్షోభంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్​లో నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించే దిశగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఆదివారం నేపాల్​ చేరుకున్న చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వైస్ మినిస్టర్​ గువో యెజౌ నేతృత్వంలోని బృందం.. పుష్ప కుమార్​ దహల్ ప్రచండతో భేటీ అయ్యింది. అనంతరం మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్​ను కలిసింది.

గువో బృందం.. అధ్యక్షుడు విద్యా దేవి భండారి, ప్రధానమంత్రి ఓలిలతో ఆదివారం వేర్వేరుగా భేటీ అయినట్లు మై రిపబ్లికా వార్తా పత్రిక పేర్కొంది. ఈ విషయాన్ని ఆయా కార్యాలయాలు ధ్రువీకరించాయి. అయితే సమావేశాల్లో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేదని వార్తా పత్రిక తెలిపింది.

నేపాల్​లోని ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్(ఎన్​సీ) అగ్రనేతలతో కూడా గువో బృందం సమావేశం కానున్నట్లు సమాచారం. పార్లమెంటు రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ఎన్​సీ.. ప్రజాప్రతినిధుల సభను పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తోంది.

ఇదీ చూడండి: నేపాల్​ రాజకీయాల్లో మరోసారి చైనా జోక్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.