ETV Bharat / international

నేపాల్ పార్లమెంటు రద్దు- వేసవిలో ఎన్నికలు

author img

By

Published : Dec 20, 2020, 5:16 PM IST

నేపాల్​లో అధికార ఎన్​సీపీలోని అంతర్గత విభేదాలు ఊహించని మలుపు తిరిగాయి. పార్లమెంటును రద్దు చేస్తూ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. కేపీ శర్మ షాకింగ్​ ఎత్తుగడ ఆయన ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలను అయోమయానికి గురి చేసింది.

Nepal PM Oli recommends dissolution of Parliament: Media reports
నేపాల్ పార్లమెంటు రద్ధు- వేసవిలో మధ్యంతర ఎన్నికలు

నేపాల్​ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. పార్లమెంటును రద్దు చేయాలని ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి విద్యా దేవీ భండారి ఆమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ 30, మే 10న రెండు విడతలుగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. కేపీ శర్మ రాజకీయ ఎత్తుగడను ఊహించని ఆయన ప్రత్యర్థి వర్గం, ప్రతిపక్షం అయోమయానికి గురయ్యాయి. ప్రధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నాయి.

గతకొద్ది నెలలుగా అధికార ఎన్​సీపీ(నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ)లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయి చేరాయి. పార్టీ అధ్యక్షుడు, ప్రధాని కేపీ శర్మ ఓలీతో.. పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ ప్రచండ(పుష్ప కుమార్​ దహాల్​)కు మధ్య తలెత్తిన వివాదం తీవ్రమైంది. ఓలీ అవినీతిలో కూరుకుపోయారని, పరిపాలనలో విఫలమైనందున పదవి నుంచి తప్పుకోవాలని ప్రచండ డిమాండ్ చేశారు. వివాదం పరిష్కారం కోసం ఇరు వర్గాలు పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆదివారం అత్యవసరంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటు రద్దు చేయాలని తీర్మానించారు ఓలీ.

రాజ్యాంగ విరుద్దం..

ఓలీ నిర్ణయం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దమని ఎన్​సీపీ అధికార ప్రతినిధి నారాయణ్​కాజీ శ్రేష్ఠ తెలిపారు. స్టాండింగ్​ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. పార్టీ నాయకులంతా ప్రచండ నివాసంలో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు.

ఓ పార్టీకి స్పష్టమైన మోజారీటీ ఉన్నప్పుడు ప్రధాని పార్లమెంటును రద్ధు చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకమని నిపుణులు చెబుతున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

275 స్థానాలున్న నేపాల్​ పార్లమెంటుకు 2017లో ఎన్నికలు జరిగాయి. ఇంకా రెండేళ్లు గడువు ఉంది. ఓలీ నిర్ణయంతో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ముదిరిన వివాదం..

కేపీ శర్మ ఓలీ, ప్రచండ మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. ఈ ఏడాది నవంబర్​ 13న ఓలీ ప్రభుత్వం అవినీతిలో కూరకుపోయిందని, పార్టీని ముందుకు నడిపించలేకపోతున్నారని 19 పేజీల నివేదికను ఎన్సీపీ సెక్రెటేరియెట్​ సమావేశంలో బహిర్గతం చేశారు ప్రచండ.

దీనిపై ఓలీ తీవ్రంగా స్పందించారు. ప్రచండ ఆరోపణలు రుజువు చేయాలని సవాల్​ విసురుతూ తన పాలనకు సంబంధించి 39 పేజీల నివేదికను విడుదల చేశారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే ప్రచండ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

పదవి నుంచి తప్పించేందుకు కుట్ర

తనను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఈ ఏడాది జూన్​లో నేపాల్ కొత్త మ్యాప్​ను విడుదల చేసిన అనంతరం ఆరోపించారు ఓలీ. నేపాల్​ పార్లమెంట్​లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ వివాదాస్పద మ్యాప్​లో భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తమవిగా చూపింది ఓలీ ప్రభుత్వం. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఓలీ నేతృత్వంలోని సీపీఎన్​-యూఎంల్​, ప్రచండ సారథ్యంలోని సీపీఎన్​(మావోయిస్ట్​ సెంటర్​)లవిలీనంతో 2018 మేలో ఏర్పాటైంది ఎన్​సీపీ. అప్పటి నుంచి పార్టీలో ఓలీ, ప్రచండల మధ్య వర్గ పోరు కొనసాగుతూనే ఉంది.

ఇదీ చూడండి: భారత రా చీఫ్​తో ఓలి భేటీపై విమర్శలు

నేపాల్​ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. పార్లమెంటును రద్దు చేయాలని ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి విద్యా దేవీ భండారి ఆమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ 30, మే 10న రెండు విడతలుగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. కేపీ శర్మ రాజకీయ ఎత్తుగడను ఊహించని ఆయన ప్రత్యర్థి వర్గం, ప్రతిపక్షం అయోమయానికి గురయ్యాయి. ప్రధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నాయి.

గతకొద్ది నెలలుగా అధికార ఎన్​సీపీ(నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ)లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయి చేరాయి. పార్టీ అధ్యక్షుడు, ప్రధాని కేపీ శర్మ ఓలీతో.. పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ ప్రచండ(పుష్ప కుమార్​ దహాల్​)కు మధ్య తలెత్తిన వివాదం తీవ్రమైంది. ఓలీ అవినీతిలో కూరుకుపోయారని, పరిపాలనలో విఫలమైనందున పదవి నుంచి తప్పుకోవాలని ప్రచండ డిమాండ్ చేశారు. వివాదం పరిష్కారం కోసం ఇరు వర్గాలు పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆదివారం అత్యవసరంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటు రద్దు చేయాలని తీర్మానించారు ఓలీ.

రాజ్యాంగ విరుద్దం..

ఓలీ నిర్ణయం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దమని ఎన్​సీపీ అధికార ప్రతినిధి నారాయణ్​కాజీ శ్రేష్ఠ తెలిపారు. స్టాండింగ్​ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. పార్టీ నాయకులంతా ప్రచండ నివాసంలో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు.

ఓ పార్టీకి స్పష్టమైన మోజారీటీ ఉన్నప్పుడు ప్రధాని పార్లమెంటును రద్ధు చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకమని నిపుణులు చెబుతున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

275 స్థానాలున్న నేపాల్​ పార్లమెంటుకు 2017లో ఎన్నికలు జరిగాయి. ఇంకా రెండేళ్లు గడువు ఉంది. ఓలీ నిర్ణయంతో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ముదిరిన వివాదం..

కేపీ శర్మ ఓలీ, ప్రచండ మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. ఈ ఏడాది నవంబర్​ 13న ఓలీ ప్రభుత్వం అవినీతిలో కూరకుపోయిందని, పార్టీని ముందుకు నడిపించలేకపోతున్నారని 19 పేజీల నివేదికను ఎన్సీపీ సెక్రెటేరియెట్​ సమావేశంలో బహిర్గతం చేశారు ప్రచండ.

దీనిపై ఓలీ తీవ్రంగా స్పందించారు. ప్రచండ ఆరోపణలు రుజువు చేయాలని సవాల్​ విసురుతూ తన పాలనకు సంబంధించి 39 పేజీల నివేదికను విడుదల చేశారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే ప్రచండ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

పదవి నుంచి తప్పించేందుకు కుట్ర

తనను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఈ ఏడాది జూన్​లో నేపాల్ కొత్త మ్యాప్​ను విడుదల చేసిన అనంతరం ఆరోపించారు ఓలీ. నేపాల్​ పార్లమెంట్​లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ వివాదాస్పద మ్యాప్​లో భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తమవిగా చూపింది ఓలీ ప్రభుత్వం. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఓలీ నేతృత్వంలోని సీపీఎన్​-యూఎంల్​, ప్రచండ సారథ్యంలోని సీపీఎన్​(మావోయిస్ట్​ సెంటర్​)లవిలీనంతో 2018 మేలో ఏర్పాటైంది ఎన్​సీపీ. అప్పటి నుంచి పార్టీలో ఓలీ, ప్రచండల మధ్య వర్గ పోరు కొనసాగుతూనే ఉంది.

ఇదీ చూడండి: భారత రా చీఫ్​తో ఓలి భేటీపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.