ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి- 70 మంది గల్లంతు - మయన్మార్​లో విరిగిపడిన కొండచరియలు

Myanmar Landslides: మయన్మార్​ కాచిన్​ ప్రావిన్స్​లో ఘోర ప్రమాదం సంభవించింది. జేడ్(పచ్చరాయి) గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 70 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా పేర్కొంది.

Myanmar Landslides
Myanmar Landslides
author img

By

Published : Dec 22, 2021, 2:17 PM IST

Myanmar Landslides: మయన్మార్​ కాచిన్​ ప్రావిన్స్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 70 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. హాపాకంత్​ ప్రాంతంలోని జేడ్(పచ్చరాయి) మైన్​​లో కూలీలు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా పేర్కొంది.

బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పలు దుకాణాలు సైతం ఇందులో కూరుకుపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా ఆ గనుల్లో తరచు కొండచరియలు విరిగిపడుతుంటాయి. గతేడాది జులై నెలలో జరిగిన ఇటువంటి ఘటనలోనే 174 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మైన్​​..

ప్రపంచంలోనే భారీ, అత్యంత లాభదాయకమైన గనిగా.. జేడ్ మైన్​ పేరొందింది. ఇది దేశంలోని అతి పెద్ద నగరమైన యూంగోన్​కు సుమారు 950 కిలోమీటర్ల (600 మైళ్లు) దూరంలో ఉంది. ఇక్కడి కార్మికులంతా ఎలాంటి ఒప్పందం లేకుండా సాధారణ కూలీలుగానే పనిచేస్తూ.. అక్కడే ఉన్న మట్టిదిబ్బల వద్ద జీవనం సాగిస్తున్నారు.

ఇదీ చదవండి: పారాగ్లైడర్​ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి

Myanmar Landslides: మయన్మార్​ కాచిన్​ ప్రావిన్స్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 70 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. హాపాకంత్​ ప్రాంతంలోని జేడ్(పచ్చరాయి) మైన్​​లో కూలీలు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా పేర్కొంది.

బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పలు దుకాణాలు సైతం ఇందులో కూరుకుపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా ఆ గనుల్లో తరచు కొండచరియలు విరిగిపడుతుంటాయి. గతేడాది జులై నెలలో జరిగిన ఇటువంటి ఘటనలోనే 174 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మైన్​​..

ప్రపంచంలోనే భారీ, అత్యంత లాభదాయకమైన గనిగా.. జేడ్ మైన్​ పేరొందింది. ఇది దేశంలోని అతి పెద్ద నగరమైన యూంగోన్​కు సుమారు 950 కిలోమీటర్ల (600 మైళ్లు) దూరంలో ఉంది. ఇక్కడి కార్మికులంతా ఎలాంటి ఒప్పందం లేకుండా సాధారణ కూలీలుగానే పనిచేస్తూ.. అక్కడే ఉన్న మట్టిదిబ్బల వద్ద జీవనం సాగిస్తున్నారు.

ఇదీ చదవండి: పారాగ్లైడర్​ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.