ETV Bharat / international

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు! - భారత్​ నేపాల్​ మైత్రి

కాలాపానీ వివాదంపై నేపాల్​ అధ్యక్షుడు ఓలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం నుంచి తన సైనికులను భారత్​ తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగును కూడా ఆక్రమించుకోలేరని స్పష్టం చేశారు.

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!
author img

By

Published : Nov 19, 2019, 5:16 AM IST

Updated : Nov 19, 2019, 8:15 AM IST

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

భారత్​-నేపాల్​ మధ్య 'కాలాపానీ' వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా.. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగును కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని వ్యాఖ్యానించారు ఆ దేశ ప్రధానమంత్రి కే.పీ. ఓలీ. కాలాపానీ నుంచి తమ సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్​ను కోరనున్నట్టు తెలిపారు.

"ఎంతో దేశభక్తి ఉన్న ప్రభుత్వం మాది. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగు కూడా ఆక్రమించుకోనివ్వదు. కాలాపానీ ప్రాంతం నుంచి భారత్.. తన సైనికులను ఉపసంహరించుకోవాలి. ఈ వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది."
--- ప్రధాని ఓలీ కార్యాలయం.

జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​​.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించిన అనంతరం భారత్​ కొత్త మ్యాప్​లను విడుదల చేసింది. వీటిలో పీఓకే(పాక్​ ఆక్రమిత కశ్మీర్​)​.. జమ్ముకశ్మీర్​లో, గిల్​గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతం లద్ధాఖ్​​లో ఉన్నాయి.

దేశ సరిహద్దును రక్షించుకోగలిగే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు ఓలీ. నేపాల్​కు చెందిన అక్రమిత భూములను తిరిగి పొందడానికి తమ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కాలాపానీ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రతిపక్ష నేపాల్​ కాంగ్రెస్​ పార్టీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

భారత్​-నేపాల్​ మధ్య 'కాలాపానీ' వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా.. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగును కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని వ్యాఖ్యానించారు ఆ దేశ ప్రధానమంత్రి కే.పీ. ఓలీ. కాలాపానీ నుంచి తమ సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్​ను కోరనున్నట్టు తెలిపారు.

"ఎంతో దేశభక్తి ఉన్న ప్రభుత్వం మాది. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగు కూడా ఆక్రమించుకోనివ్వదు. కాలాపానీ ప్రాంతం నుంచి భారత్.. తన సైనికులను ఉపసంహరించుకోవాలి. ఈ వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది."
--- ప్రధాని ఓలీ కార్యాలయం.

జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​​.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించిన అనంతరం భారత్​ కొత్త మ్యాప్​లను విడుదల చేసింది. వీటిలో పీఓకే(పాక్​ ఆక్రమిత కశ్మీర్​)​.. జమ్ముకశ్మీర్​లో, గిల్​గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతం లద్ధాఖ్​​లో ఉన్నాయి.

దేశ సరిహద్దును రక్షించుకోగలిగే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు ఓలీ. నేపాల్​కు చెందిన అక్రమిత భూములను తిరిగి పొందడానికి తమ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కాలాపానీ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రతిపక్ష నేపాల్​ కాంగ్రెస్​ పార్టీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: La Caja Magica, Madrid, Spain. 17th November 2019.
1. 00:00 Novak Djokovic arrival - fans cheering
2. 00:06 Djokovic preparing for training
3. 00:16 Wide training session
4. 00:22 Djokovic hitting balls
5. 00:31 Wide Djokovic training
6. 00:37 Close up of Djokovic
7. 00:44 Djokovic hitting balls
9. 00:51 Audience watching
10. 00:54 Djokovic hitting balls
11. 01:00 Tilt of Djokovic catching a ball with his foot
12. 01:07 Wide of Djokovic training
SOURCE: SNTV
DURATION: 01:15
STORYLINE:
Serbia begin their Davis Cup campaign in the competition's new format on Wednesday in Madrid against Japan and captain Nenad Zimonjic is hopeful of being able to call on a fully-fit Novak Djokovic.
The world number two experienced pain in his troublesome right elbow in his ATP Finals loss to Roger Federer on Thursday but practiced on site on Sunday in the Spanish capital.
Last Updated : Nov 19, 2019, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.