హాంకాంగ్లో జన సంచారం ఎక్కువగా ఉండే కౌలూన్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా... మరికొందరికి గాయాలయ్యాయి. కౌలూన్ ప్రాంతం స్థానిక వ్యాపార సంస్థలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడ ఉండే పాత అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రాంతంలో ఎక్కువమంది దక్షణాసియాకి చెందినవారు ఉంటారు. లోకల్ మీడియా విడుదల చేసిన వీడియోలో చైనీయులు ఉన్న ఆనవాళ్లు కనిపించలేదు. హాంకాంగ్ నాయకురాలు క్యారీ లామ్ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.