ETV Bharat / international

కరోనాపై పోరులో భారత్​కు ఎన్​డీబీ భారీ సాయం

author img

By

Published : May 13, 2020, 12:53 PM IST

కరోనా వైరస్​ను అరికట్టటానికి భారత్​కు తక్షణ సాయం కింద బ్రిక్స్​ దేశాల అభివృద్ధి బ్యాంకు ఎన్​డీబీ 1 బిలియన్​ డాలర్ల రుణం అందించింది. భారత్​లో క్లిష్టమైన ఆరోగ్య చికిత్సలకు నిధులు సమకూర్చటం, జాతీయ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటం, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను పునరుద్ధరించటానికి ఈ నిధులు వెచ్చించాలని సూచించింది ఎన్​డీబీ.

BRICS' New Development Bank
కరోనాపై పోరుకు భారత్​కు బ్రిక్స్​ అభివృద్ధి బ్యాంకు భారీ సాయం

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత్​కు సాయం చేసింది బ్రిక్స్​ దేశాల కూటమికి చెందిన న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​ (ఎన్​డీబీ). కొవిడ్​-19 వ్యాప్తిని అరికట్టడం, మానవ, సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు అత్యవసర సహాయం కింద 1 బిలియన్​ డాలర్లు రుణం అందించింది.

భారత్​కు అత్యవసర సహాయ రుణం అందించేందుకు ఏప్రిల్​ 30న ఎన్​డీబీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణ సాయం పై ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు బ్యాంకు ఉపాధ్యక్షుడు జియాన్​ ఝూ.

ఈ విపత్కర పరిస్థితుల్లో బ్రిక్స్​ సభ్యదేశాలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఎన్​డీబీ నిర్ణయించింది. కరోనా పై పోరులో అవసరమైన నిధుల కోసం భారత ప్రభుత్వం చేసిన వినతికి త్వరితగతిన స్పందించి ఈ రుణం మంజూరు చేశాం. సామాజిక భద్రతను బలోపేతం చేయటం, ఆరోగ్య విభాగం అత్యవసర సేవలకు జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చు, 2021, జనవరి 1 వరకు వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు, సామాజిక భద్రత కోసం చేసే వ్యయం ఈ ఆర్థిక సాయం పరిధిలో ఉంటుంది.

– జియాన్​ ఝూ, ఎన్​డీబీ ఉపాధ్యక్షుడు.

కరోనా నుంచి కలిగే ముప్పును ఎదుర్కోవటం, నిరోధించటం, గుర్తిచటం సహా తగిన విధంగా స్పందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు జియాన్​. భారత్​లో ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే విధంగా క్లిష్టతరమైన ఆరోగ్య చికిత్సలకు నిధులు సమకూర్చటం, జాతీయ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటం, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను పునరుద్ధరించే కార్యక్రమాలకు తక్షణ సాయం అందించటం దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత్​కు సాయం చేసింది బ్రిక్స్​ దేశాల కూటమికి చెందిన న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​ (ఎన్​డీబీ). కొవిడ్​-19 వ్యాప్తిని అరికట్టడం, మానవ, సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు అత్యవసర సహాయం కింద 1 బిలియన్​ డాలర్లు రుణం అందించింది.

భారత్​కు అత్యవసర సహాయ రుణం అందించేందుకు ఏప్రిల్​ 30న ఎన్​డీబీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణ సాయం పై ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు బ్యాంకు ఉపాధ్యక్షుడు జియాన్​ ఝూ.

ఈ విపత్కర పరిస్థితుల్లో బ్రిక్స్​ సభ్యదేశాలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఎన్​డీబీ నిర్ణయించింది. కరోనా పై పోరులో అవసరమైన నిధుల కోసం భారత ప్రభుత్వం చేసిన వినతికి త్వరితగతిన స్పందించి ఈ రుణం మంజూరు చేశాం. సామాజిక భద్రతను బలోపేతం చేయటం, ఆరోగ్య విభాగం అత్యవసర సేవలకు జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చు, 2021, జనవరి 1 వరకు వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు, సామాజిక భద్రత కోసం చేసే వ్యయం ఈ ఆర్థిక సాయం పరిధిలో ఉంటుంది.

– జియాన్​ ఝూ, ఎన్​డీబీ ఉపాధ్యక్షుడు.

కరోనా నుంచి కలిగే ముప్పును ఎదుర్కోవటం, నిరోధించటం, గుర్తిచటం సహా తగిన విధంగా స్పందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు జియాన్​. భారత్​లో ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే విధంగా క్లిష్టతరమైన ఆరోగ్య చికిత్సలకు నిధులు సమకూర్చటం, జాతీయ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటం, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను పునరుద్ధరించే కార్యక్రమాలకు తక్షణ సాయం అందించటం దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.