చైనాలో కరోనా ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. మరోవైపు వరదల వంటి ప్రకృత్తి విపత్తులు.. తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా భూకంపం చైనాను వణికించింది. హుబే రాష్ట్రంలోని తాంగ్షాన్ నగరంలో మధ్యస్థాయి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతగా నమోదైంది. బీజింగ్ సహా సమీప ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
24 నిమిషాల వ్యవధిలో రెండోసారి..
గుయే జిల్లాలో స్థానిక సమయం ప్రకారం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు మొదటసారి భూమి కంపించగా... రెండోసారి 7 గంటల 2 నిమిషాలకు 2.2 తీవ్రతతో స్వల్పంగా ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో ఇళ్లలోని సామగ్రి చిందరవందరగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు... ప్రభావిత ప్రాంతాలకు సహాయ బృందాలను పంపించారు. ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
తాంగ్షాన్లో 1976లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,40,000 మందికి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: లూసియానా ప్రైమరీలో ట్రంప్, బైడెన్ ఘనవిజయం