ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ వెలుపల ప్రపంచంలోనే తొలి యోగా విశ్వవిద్యాలయం 'వివేకానంద యోగా యూనివర్సిటీ (వీఏవైయూ)' అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ప్రారంభమైంది. ప్రాచీన భారతీయ యోగా అభ్యాసానికి శాస్త్రీయ సూత్రాలు, ఆధునిక పరిశోధన విధానాలను సమ్మిళితంగా అందించనుంది ఈ విశ్వవిద్యాలయం.
న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన స్థాయీ సంఘం ఛైర్పర్సన్ పీపీ చౌదరి కలిసి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కన్సులేట్ జనరల్, అమెరికాలోని జైపూర్ ఫూట్ ఛైర్పర్సన్, వీఏవైయూ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రేమ్ భందారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది.
" భారత సంస్కృతి, వారసత్వానికి చిహ్నమైన యోగా.. ప్రపంచంలో ఐక్యత, సోదరభావానికి సాధనంగా మారింది. యోగా మాధ్యమం ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తున్నాం. యోగా అనేది మానసిక సమతుల్యత, స్థిరత్వాన్ని అందిస్తుంది."
- మురళీధరన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి.
తొలి ఛైర్మన్గా భారతీయ యోగా గురువు..
భారత్ వెలుపల తొలి యోగా విశ్వవిద్యాలయానికి తొలి ఛైర్మన్గా ప్రముఖ భారతీయ యోగా గురువు, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్(ఎస్వీవైఏఎస్ఏ) ఛాన్సిలర్ హెచ్ఆర్ నాగేంద్ర నియమితులయ్యారు.
ఇదీ చూడండి: 'భారత్- చైనా' మధ్య 11 గంటల చర్చ ఎందుకంటే?