అమెరికాలోని చికాగోలో కారులో వెళ్తున్న మూడేళ్ల చిన్నారిపై కాల్పులు జరిపారు దుండగులు. మంగళవారం ఉదయం లేక్ షోర్ డ్రైవ్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అంతకు కొన్ని గంటల ముందే సమీప ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలు చికాగో చరిత్రలోనే హింసాత్మకమని పోలీసులు పేర్కొన్నారు.
చిన్నారిపై గురి..
గ్రాంట్ పార్క్లోని ఓ ఆలయం వద్ద ఉదయం 11 గంటలకు కారులో వెళ్తుండగా బాలుడి తలపై కాల్పులు జరిగాయి. దీంతో కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం కారు పల్టీ కొట్టింది. ఈ క్రమంలో చిన్నారితో కారులో నుంచి మహిళ బయటకు దూకిందని స్థానికులు చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మహిళ కడుపులో కాల్పులు..
ఏంజెల్వుడ్లో సోమవారం రాత్రి జరిగిన ఓ ఘర్షణ.. కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఓ మహిళ చేయి, కడుపులో బుల్లెట్లు దిగగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: శ్రీలంక ఉగ్రదాడి సూత్రధారి అతడే!