అఫ్గానిస్థాన్లోని కాందహార్ విమానాశ్రయంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు ఆ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇది తాలిబన్ల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.
గత నెలలో ఈద్ ప్రార్థనల సమయంలో ఆ దేశ అధ్యక్షడి నివాస భవనానికి సమీప ప్రాంతాల్లో మూడు రాకెట్లతో దాడి జరిగింది.
గత కొన్నివారాలుగా అఫ్గాన్ పౌరులు, రక్షణ, భద్రతా దళాలపై తాలిబన్లు దాడులను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 4000 మంది పౌరులు సహా 2,000 వేల మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంది.
దేశంలోని 200కు పైగా జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సరిహద్దుల్లోని 10 క్రాసింగ్ పాయింట్లను హస్తగతం చేసుకున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: చైనాలో మరిన్ని ప్రాంతాలకు డెల్టా ముప్పు