ETV Bharat / entertainment

సూర్య కొత్త సినిమా ఆమెతోనే..- 'అటాక్‌' హిట్​ టాక్​

author img

By

Published : Apr 7, 2022, 7:21 PM IST

తమిళ స్టార్​ సూర్య కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేసింది. 'ఆకాశమే నీ హద్దురా' దర్శకురాలితో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్‌ 1న విడుదలైన 'అటాక్‌'కు హిట్​ రావడం పట్ల హీరో జాన్​ అబ్రహం ఆనందం వ్యక్తం చేశారు.

surya, john
సూర్య, జాన్​

'గురు', 'ఆకాశమే నీ హద్దురా'.. దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధా కొంగర.. తన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చారు. సూర్యతో తన తర్వాతి సినిమా ఉండనుందని వెల్లడించారు. సూర్య- సుధ కాంబినేషన్​లో వచ్చిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొత్త సినిమాపై పలు విషయాలను వెల్లిడించారు సుధ. ఈ చిత్రం బయోపిక్ కాదని, నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.

ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో నటించిన 'అటాక్‌' ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్‌ మూవీగా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. జాన్ అబ్రహాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. '‘వెండితెరపై మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పరిశ్రమకు మా తరఫున ఏదైనా వినూత్నంగా అందించాలనుకున్నాం. అందులో భాగమే ‘అటాక్‌’. కరోనా మూడు దశలను దాటుకుని సినిమాను విడుదల చేయడం పెద్ద సవాలుగా మారింది. అయినా మేము అనుకున్నది సాధించాం. ఈ సినిమా కోసం నిజాయితీతో శ్రమించిన ప్రతి టీమ్‌ సభ్యుడికి ధన్యవాదాలు' అంటూ నెటిజన్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.

'గురు', 'ఆకాశమే నీ హద్దురా'.. దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధా కొంగర.. తన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చారు. సూర్యతో తన తర్వాతి సినిమా ఉండనుందని వెల్లడించారు. సూర్య- సుధ కాంబినేషన్​లో వచ్చిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొత్త సినిమాపై పలు విషయాలను వెల్లిడించారు సుధ. ఈ చిత్రం బయోపిక్ కాదని, నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.

ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో నటించిన 'అటాక్‌' ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్‌ మూవీగా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. జాన్ అబ్రహాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. '‘వెండితెరపై మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పరిశ్రమకు మా తరఫున ఏదైనా వినూత్నంగా అందించాలనుకున్నాం. అందులో భాగమే ‘అటాక్‌’. కరోనా మూడు దశలను దాటుకుని సినిమాను విడుదల చేయడం పెద్ద సవాలుగా మారింది. అయినా మేము అనుకున్నది సాధించాం. ఈ సినిమా కోసం నిజాయితీతో శ్రమించిన ప్రతి టీమ్‌ సభ్యుడికి ధన్యవాదాలు' అంటూ నెటిజన్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.