ETV Bharat / crime

నా భర్తని చంపెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా..

author img

By

Published : Dec 29, 2022, 12:47 PM IST

Updated : Dec 29, 2022, 1:02 PM IST

Wife Killed Husband : వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ బాబూ ఉన్నాడు. అతను ఓ షాపింగ్ కాంప్లెక్స్​లో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్నాడు. ఉన్నంతలో హాయిగానే జీవిస్తున్నారు. ఇంతలో ఆమెకు ఓ అపరిచిత వ్యకితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అతడిపై ప్రేమకు దారితీసింది. తన భర్తను చంపి అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని అతడికి ఆఫర్​ ఇచ్చింది. ఇంకేముంది మనోడు ఆ ఆఫర్​కు ఓకే చెప్పాడు. కట్​చేస్తే.. ఇద్దరూ కలిసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ ఘటన కర్నూలులో చేటుచేసుకుంది.

Wife Killed Husband
Wife Killed Husband
నా భర్తని చంపేయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా..!

Wife Killed Husband : ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఆల్వాలకు చెందిన ఆమోస్‌ హత్య కేసులో అతని భార్య అరుణతో పాటు ఆమె ప్రియుడు ములకల సూర్య ప్రదీప్‌, జీవన్‌కుమార్‌లను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులోని కార్యాలయంలో డీఎస్పీ కె.వి.మహేష్‌కుమార్‌, సీఐ శంకరయ్య బుధవారం వివరాలు వెల్లడించారు. ఆల్వాలకు చెందిన ఆమోస్‌, అరుణ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు అరుణ మైనర్‌ కావటంతో ఆమోస్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జైలుకు వెళ్లాడు. ఆమె మేజర్‌ అయిన తర్వాత ఇద్దరూ కాపురం పెట్టారు. వీరికి అఖిల్‌ అనే ఐదేళ్ల కుమారుడు సంతానం.

కర్నూలులోని ఉద్యోగ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నగరంలోని సిటీస్కైర్‌ మాల్‌లో ఆమోస్‌ సెక్యూరిటీ గార్డుగా.. కాంప్లెక్స్‌లోని వస్త్ర దుకాణంలో అరుణ సేల్స్‌గర్ల్‌గా పనిచేసేవారు. మద్యానికి బానిసైన ఆమోస్‌ రోజూ భార్యను వేధించేవాడు. వీరి ఇంటి సమీపంలో ఉండే ములకల సూర్యప్రదీప్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ సాయంత్రం సమయంలో ఆటో నడిపేవాడు. అప్పుడప్పుడూ దంపతులు ఇతని ఆటోలో వెళ్లేవారు. సూర్యప్రదీప్‌తో కలిసి ఆమోస్‌ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో అరుణకు సూర్యప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. తన భర్తను చంపి అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో అరుణ చెప్పింది. దీంతో అతడు హత్యకు పథక రచన చేసి తన స్నేహితుడు జీవన్‌కుమార్‌కు విషయం చెప్పాడు.

22వ తేదీ రాత్రి సూర్యప్రదీప్‌, జీవన్‌కుమార్‌.. ఆమోస్‌ను తీసుకొని శరీన్‌నగర్‌ సవారీతోట హంద్రీ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అతనికి మద్యం తాగించి వెంట తెచ్చుకున్న ఫ్యాను రాడ్డుతో బలంగా కొట్టి చంపేశారు. సూర్యప్రదీప్‌ పెట్రోలు తీసి నిప్పంటించాడు. శవం పూర్తిగా కాలకపోవడంతో హంద్రీ ఒడ్డుకు ఈడ్చుకెళ్లి పడేసి వెళ్లిపోయాడు. తర్వాత అతను అరుణకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 24న శవం బయటపడటంతో కర్నూలు నాలుగో పట్టణ సీఐ శంకరయ్య కేసు నమోదు చేశారు. అనుమానంతో అరుణను విచారించటంతో అసలు విషయం బయటపడింది.

ఇవీ చదవండి

నా భర్తని చంపేయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా..!

Wife Killed Husband : ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఆల్వాలకు చెందిన ఆమోస్‌ హత్య కేసులో అతని భార్య అరుణతో పాటు ఆమె ప్రియుడు ములకల సూర్య ప్రదీప్‌, జీవన్‌కుమార్‌లను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులోని కార్యాలయంలో డీఎస్పీ కె.వి.మహేష్‌కుమార్‌, సీఐ శంకరయ్య బుధవారం వివరాలు వెల్లడించారు. ఆల్వాలకు చెందిన ఆమోస్‌, అరుణ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు అరుణ మైనర్‌ కావటంతో ఆమోస్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జైలుకు వెళ్లాడు. ఆమె మేజర్‌ అయిన తర్వాత ఇద్దరూ కాపురం పెట్టారు. వీరికి అఖిల్‌ అనే ఐదేళ్ల కుమారుడు సంతానం.

కర్నూలులోని ఉద్యోగ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నగరంలోని సిటీస్కైర్‌ మాల్‌లో ఆమోస్‌ సెక్యూరిటీ గార్డుగా.. కాంప్లెక్స్‌లోని వస్త్ర దుకాణంలో అరుణ సేల్స్‌గర్ల్‌గా పనిచేసేవారు. మద్యానికి బానిసైన ఆమోస్‌ రోజూ భార్యను వేధించేవాడు. వీరి ఇంటి సమీపంలో ఉండే ములకల సూర్యప్రదీప్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ సాయంత్రం సమయంలో ఆటో నడిపేవాడు. అప్పుడప్పుడూ దంపతులు ఇతని ఆటోలో వెళ్లేవారు. సూర్యప్రదీప్‌తో కలిసి ఆమోస్‌ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో అరుణకు సూర్యప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. తన భర్తను చంపి అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో అరుణ చెప్పింది. దీంతో అతడు హత్యకు పథక రచన చేసి తన స్నేహితుడు జీవన్‌కుమార్‌కు విషయం చెప్పాడు.

22వ తేదీ రాత్రి సూర్యప్రదీప్‌, జీవన్‌కుమార్‌.. ఆమోస్‌ను తీసుకొని శరీన్‌నగర్‌ సవారీతోట హంద్రీ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అతనికి మద్యం తాగించి వెంట తెచ్చుకున్న ఫ్యాను రాడ్డుతో బలంగా కొట్టి చంపేశారు. సూర్యప్రదీప్‌ పెట్రోలు తీసి నిప్పంటించాడు. శవం పూర్తిగా కాలకపోవడంతో హంద్రీ ఒడ్డుకు ఈడ్చుకెళ్లి పడేసి వెళ్లిపోయాడు. తర్వాత అతను అరుణకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 24న శవం బయటపడటంతో కర్నూలు నాలుగో పట్టణ సీఐ శంకరయ్య కేసు నమోదు చేశారు. అనుమానంతో అరుణను విచారించటంతో అసలు విషయం బయటపడింది.

ఇవీ చదవండి

Last Updated : Dec 29, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.