మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహార్నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవిపై అత్యాచారం కేసు నమోదైంది. స్థానికంగా నివసించే ఓ మహిళ.. తనపై కార్పొరేటర్ రవి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి పిర్యాదు మేరకు కార్పొరేటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన జవహార్నగర్ పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.