రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్పై అప్పా జంక్షన్ వద్ద సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు.. ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కారు యాజమాని హెటిరో డైరెక్టర్ భాస్కర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: హత్యకు దారి తీసిన భార్యభర్తల గొడవ