ETV Bharat / crime

కత్తితో దాడి.. యువకుడు స్పాట్​ డెడ్​ - yaadadri bhuvanagiri latest news

ఓ యువకుడిపై మరో యువకుడు క్తతితో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

One person was killed when a young man attacked another man with a knife in yadaddri bhuvangiri
కత్తితో దాడి.. యువకుడు స్పాట్​ డెడ్​
author img

By

Published : Feb 12, 2021, 12:55 AM IST

Updated : Feb 12, 2021, 6:47 AM IST

ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కాస్తా ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జినుక శివ(29)ను శివని గూని నరేందర్( 25) అనే యువకుడు కత్తితో పొడిచాడు. బాధితుడికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు.

ఘటనకు ముందు మృతునిపై నిందితుడు, అతని పెద్దనాన్న కుటుంబ సభ్యులు ఓ వ్యక్తిగత విషయమై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి

ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కాస్తా ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జినుక శివ(29)ను శివని గూని నరేందర్( 25) అనే యువకుడు కత్తితో పొడిచాడు. బాధితుడికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు.

ఘటనకు ముందు మృతునిపై నిందితుడు, అతని పెద్దనాన్న కుటుంబ సభ్యులు ఓ వ్యక్తిగత విషయమై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి

Last Updated : Feb 12, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.