రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసింది. ఘటనలో గ్రామానికి చెందిన ఎంజీ ఖాజా మృతి చెందాడు. ఆవుదాడిలో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
![పహాడిషరీఫ్లో ఆవు బీభత్సం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10398671_cow-2.jpg)
సమాచారం అందుకున్న పోలీసులు జూపార్క్ నుంచి రెస్క్యూటీంను రప్పించారు. స్థానికులతో కలిసి అధికారులు ఆవును పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యుడు గాయపడ్డాడు.
![ఎట్టకేలకు చిక్కింది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10398671_cow.jpg)
ఇదీ చూడండి: ఆ పని తప్పని చెప్పినందుకు.. పోలీసులనే కొట్టాడు