రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ కరెంట్ పోల్ను బలంగా ఢీ కొట్టింది. ఘటనలో అజీజ్నగర్కు చెందిన అఖిల్ రెడ్డి(22) అక్కడికక్కడే మరణించాడు.
ఆయన అదే గ్రామానికి చెందిన స్నేహితుడితో కలసి రాత్రి సమయంలో కారులో బకారం గ్రామానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా అజీజ్నగర్ స్టేజ్ వద్ద ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : శంషాబాద్లో రూ.1.3 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం