సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని గాడిదల కుంటను పలువురు అక్రమార్కులు చేజిక్కించుకోవాలనుకున్నారు. ఆక్రమణ కోసం జేసీబీ సాయంతో కుంటను పూడ్చే ప్రయత్నం చేశారు. విషయం గమనించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పనులను నిలిపివేశారు.
కుంటను పూడ్చేయడానికి వాడిన జేసీబీని సీజ్ చేశారు. డ్రైవర్, మరో వ్యక్తిపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇంకెవరైనా శిఖం భూములను ఆక్రమించాలని చూస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: కరోనా భయాలు- పాఠశాలలు తెరుచుకునేదెప్పుడు?