ETV Bharat / crime

శంషాబాద్​లో సుమారు కిలో బంగారం సీజ్​

author img

By

Published : Mar 13, 2021, 7:46 PM IST

Updated : Mar 13, 2021, 8:13 PM IST

శంషాబాద్​ విమానాశ్రయంలో శుక్ర, శనివారాల్లో 1,065 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో షార్జా నుంచి వచ్చిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

GOLD SEIZED
శంషాబాద్​లో రెండు రోజుల్లో 1,065 గ్రాముల బంగారం సీజ్​

శంషాబాద్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం.. బంగారం అక్రమ రవాణాకు పాల్పడిన ప్రయాణికుడిని కస్టమ్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన సదరు వ్యక్తి.. ప్రత్యేకంగా రూపొందించిన చెప్పుల్లో పేస్ట్​ రూపంలో 672 గ్రాముల పసిడిని దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో గుర్తించిన అధికారులు.. 594 గ్రాముల నికర బంగారాన్ని వెలికి తీశారు. దీని విలువ రూ.27.4 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్​లో రెండు రోజుల్లో 1,065 గ్రాముల బంగారం సీజ్​

నోట్లో దాచిపెట్టి..

శుక్రవారం.. షార్జా నుంచి శంషాబాద్​ విమానాశ్రయానికి వచ్చిన నలుగురి ప్రయాణికుల వద్ద నుంచి 471 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేస్తుకున్నారు. దీని విలువ రూ.20.67 లక్షలు ఉంటుందని అంచనా వేస్తోంది. వీరంతా బంగారం ముక్కలను నోట్లో దాచిపెట్టుకున్నారు. గుర్తించిన అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.

ఇవీచూడండి: టీఎస్​పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్​.. సైబర్​ క్రైంకు ఫిర్యాదు

శంషాబాద్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం.. బంగారం అక్రమ రవాణాకు పాల్పడిన ప్రయాణికుడిని కస్టమ్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన సదరు వ్యక్తి.. ప్రత్యేకంగా రూపొందించిన చెప్పుల్లో పేస్ట్​ రూపంలో 672 గ్రాముల పసిడిని దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో గుర్తించిన అధికారులు.. 594 గ్రాముల నికర బంగారాన్ని వెలికి తీశారు. దీని విలువ రూ.27.4 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్​లో రెండు రోజుల్లో 1,065 గ్రాముల బంగారం సీజ్​

నోట్లో దాచిపెట్టి..

శుక్రవారం.. షార్జా నుంచి శంషాబాద్​ విమానాశ్రయానికి వచ్చిన నలుగురి ప్రయాణికుల వద్ద నుంచి 471 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేస్తుకున్నారు. దీని విలువ రూ.20.67 లక్షలు ఉంటుందని అంచనా వేస్తోంది. వీరంతా బంగారం ముక్కలను నోట్లో దాచిపెట్టుకున్నారు. గుర్తించిన అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.

ఇవీచూడండి: టీఎస్​పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్​.. సైబర్​ క్రైంకు ఫిర్యాదు

Last Updated : Mar 13, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.