నాకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని... కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఉమ్మడి జిల్లా పార్టీలో కొంత మంది క్రమశిక్షణ తప్పిన మాట నిజమేనని... ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. త్వరలో అంత సర్దుమనుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల ఫీజుపై సుప్రీం కీలక సూచనలు