నిజామాబాద్ డీసీసీబీ పాలకవర్గం సమావేశంలో ఛైర్మన్పై అసంతృప్తి వ్యక్తమైంది. పాలనాపరమైన వ్యవహారాలపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఛైర్మన్ గంగాధర్ పట్వారపై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ సభ్యులే పట్టు పట్టినట్లు తెలుస్తోంది. అందుకు మెజార్టీ సభ్యులు అంగీకరించినట్లు సమాచారం. మంత్రి ప్రశాంత్రెడ్డికి సమస్య వివరించి, ఆయన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించి సమావేశం ముగించారు.
ఇదే విషయమై స్పీకర్ పోచారంను కలిసిన సభ్యులు పరిస్థితిని వివరించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై సభ్యులంతా ఒక నిర్ణయానికి రానున్నారు. అధికార పార్టీకి చెందిన సభ్యులే ఛైర్మన్పై అవిశ్వాసానికి పట్టుబట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇవీచూడండి: 'ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి'