గాల్వన్ లోయ ఘటనలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆయన స్వస్థలం సుర్యాపేటలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు అవిష్కరించనున్నారు. ఈ మేరకు పురపాలక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేటలో సంతోశ్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. సంతోశ్బాబు చౌరస్తాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఏడాదిలో ప్రభుత్వం 20 లక్షల ఖర్చుతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటుచేశారు. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మంత్రి కేటీఆర్.....కర్నల్ విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. అనంతరం సూర్యాపేటలో రోడ్డు విస్తరణ, సమీకృత మార్కెట్ యార్డుకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.