ETV Bharat / city

Etela: ఈటల ర్యాలీలో డీజే బంద్.. పోలీసుల తీరుపై అనుచరులు సీరియస్

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్​లో మాజీ మంత్రి ఈటల పర్యటనలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో ఏర్పాటుచేసిన డీజే ఫ్యూజ్​లను స్థానిక ఎస్​ఐ తొలగించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల వర్గీయులు ఎస్​ఐ వాహనాన్ని చుట్టుముట్టారు.

author img

By

Published : Jun 22, 2021, 6:04 PM IST

ETELA RAJENDER
etela

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ర్యాలీ సందర్భంగా పోలీసులు, ఆయన వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఈటల వర్గీయులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్​లో ఈ వివాదం చోటు చేసుకొంది.

ఈటల ర్యాలీగా వెళ్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ కిరణ్​రెడ్డి.. డీజేకు అనుమతి లేదంటూ ఫ్యూజ్​లను తొలగించారు. దీంతో ఈటల అనుచరులు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనను పట్టించుకోని ఎస్సై తన వాహనం ఎక్కి కూర్చొన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల అనుచరులు.. ఎస్​ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. కొంత మంది జోక్యం చేసుకొని ఎస్​ఐతో మాట్లాడి.. డీజేకు సంబంధించిన ప్యూజ్​లను ఇప్పించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

ఈ క్రమంలో అక్కడకొచ్చిన ఏసీపీ విజయ్​కుమార్.. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో డీజేకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. కరీంనగర్ సీపీగా కమలాసన్​రెడ్డి ఉన్నంత కాలం... డీజేలకు అనుమతించేది లేదని ఏసీసీ స్పష్టం చేశారు.

ఈటల ర్యాలీలో డీజే ఫ్యూజ్​లను తొలగించిన పోలీసులు

ఇదీచూడండి: MINISTER PRASHANTH REDDY: 'తండ్రి నీటి దొంగైతే... కొడుకు గజదొంగ'

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ర్యాలీ సందర్భంగా పోలీసులు, ఆయన వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఈటల వర్గీయులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్​లో ఈ వివాదం చోటు చేసుకొంది.

ఈటల ర్యాలీగా వెళ్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ కిరణ్​రెడ్డి.. డీజేకు అనుమతి లేదంటూ ఫ్యూజ్​లను తొలగించారు. దీంతో ఈటల అనుచరులు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనను పట్టించుకోని ఎస్సై తన వాహనం ఎక్కి కూర్చొన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల అనుచరులు.. ఎస్​ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. కొంత మంది జోక్యం చేసుకొని ఎస్​ఐతో మాట్లాడి.. డీజేకు సంబంధించిన ప్యూజ్​లను ఇప్పించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

ఈ క్రమంలో అక్కడకొచ్చిన ఏసీపీ విజయ్​కుమార్.. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో డీజేకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. కరీంనగర్ సీపీగా కమలాసన్​రెడ్డి ఉన్నంత కాలం... డీజేలకు అనుమతించేది లేదని ఏసీసీ స్పష్టం చేశారు.

ఈటల ర్యాలీలో డీజే ఫ్యూజ్​లను తొలగించిన పోలీసులు

ఇదీచూడండి: MINISTER PRASHANTH REDDY: 'తండ్రి నీటి దొంగైతే... కొడుకు గజదొంగ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.