ETV Bharat / city

కరీంనగర్ కార్పొరేషన్‌ భవితవ్యం నేడే - karimnagar municipal corporation election results today

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. మొత్తం మూడు రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మొత్తం 650 మంది సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది.

కరీంనగర్ కార్పొరేషన్‌ భవితవ్యం నేడే
కరీంనగర్ కార్పొరేషన్‌ భవితవ్యం నేడే
author img

By

Published : Jan 27, 2020, 5:05 AM IST

రెండో విడతలో జరిగిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ జరగనుంది. మొత్తం 3 రౌండ్ల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 58 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఒకరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొత్తం 650 మంది సిబ్బందిని లెక్కింపు కోసం ఉపయోగిస్తున్నారు. మొదట డివిజన్‌ల వారిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్లలో... 366 అభ్యర్థులు బరిలో ఉన్నారు. భద్రత దృష్ట్యా కౌంటింగ్ వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్‌ భవితవ్యం నేడే

ఇవీ చూడండి: రాజ్​భవన్​​లో ఎట్​హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు

రెండో విడతలో జరిగిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ జరగనుంది. మొత్తం 3 రౌండ్ల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 58 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఒకరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొత్తం 650 మంది సిబ్బందిని లెక్కింపు కోసం ఉపయోగిస్తున్నారు. మొదట డివిజన్‌ల వారిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్లలో... 366 అభ్యర్థులు బరిలో ఉన్నారు. భద్రత దృష్ట్యా కౌంటింగ్ వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్‌ భవితవ్యం నేడే

ఇవీ చూడండి: రాజ్​భవన్​​లో ఎట్​హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.