ETV Bharat / city

విద్యుత్ ఉద్యోగుల విభజన: ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

author img

By

Published : Nov 25, 2020, 7:04 PM IST

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం రిజర్వ్‌ చేసింది.

విద్యుత్ ఉద్యోగుల విభజన: ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్‌
విద్యుత్ ఉద్యోగుల విభజన: ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్‌

తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వాదనలు వినిపించాయి. తెలంగాణ సంస్థలు లేవనెత్తిన అంశాలను ఏపీ వ్యతిరేకించింది.

ఎంతమందిని ఏపీకి కేటాయించారో అంతమందీ తెలంగాణకు వెళ్లాలని.. స్థానికత ఆధారంగా కేటాయింపులు సరికాదని కోర్టులు చెప్పాయని ఏపీ సంస్థలు స్పష్టం చేశాయి. జస్టిస్ ధర్మాధికారి అన్నీ లెక్కించే కేటాయించారని పేర్కొన్నాయి. గత విచారణలో తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదనలు వినిపించాయి.

తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వాదనలు వినిపించాయి. తెలంగాణ సంస్థలు లేవనెత్తిన అంశాలను ఏపీ వ్యతిరేకించింది.

ఎంతమందిని ఏపీకి కేటాయించారో అంతమందీ తెలంగాణకు వెళ్లాలని.. స్థానికత ఆధారంగా కేటాయింపులు సరికాదని కోర్టులు చెప్పాయని ఏపీ సంస్థలు స్పష్టం చేశాయి. జస్టిస్ ధర్మాధికారి అన్నీ లెక్కించే కేటాయించారని పేర్కొన్నాయి. గత విచారణలో తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదనలు వినిపించాయి.

ఇదీ చదవండి: వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 3 వరకు స్టే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.