ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jan 30, 2021, 2:59 PM IST

topten news @3pm
టాప్​టెన్​ న్యూస్​ @3pm

1. మహాత్ముని స్మరణ..

హైదరాబాద్​లోని బాపూ ఘాట్​ వద్ద నేతలు నివాళులర్పించారు. గవర్నర్​ సహా మంత్రులు మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ ఆదర్శప్రాయ వ్యక్తిత్వాన్ని నేతలు స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఊరుకోం..

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భద్రాద్రి సీతారామున్ని దర్శించుకున్న మంత్రి.. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.పోరాడతాం..

అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంటకు మద్ధతు ధరతో పాటు బోర్డు ఏర్పాటు చేస్తానన్న భాజపా ఎంపీ అర్వింద్‌ హామీ నిలుపుకోవాలంటూ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విడిగా బతకలేక..

ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసే జీవితాంతం బతికాలని ఆశపడ్డారు. విధి వారిద్దరినీ విడదీసింది. వారి ఆశలను సమాధి చేసింది. తప్పక.. ఇటీవలే ఇద్దరూ వేరేవాళ్లను మనువాడారు. పెళ్లి పీఠలైతే ఎక్కారు.. కానీ వేరేవాళ్లతో జీవితాన్ని పంచుకోలేకపోయారు. పెళ్లి కలవలేకపోయిన వాళ్లు చావుతో ఒక్కటవ్వాలి అనుకున్నారు. ఒకే చున్నీకి కలిసి ఉరేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పడారుపల్లిలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అఖిలపక్షం..

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బడ్జెట్​ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ అజెండాను ఇందులో మోదీ వివరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కొమ్మలతో కొట్టుకోవడం..

బోండా ఘాట్‌లో వింత పండుగ.. 'ఈ జటి పరబ్'​ పండుగను గిరిజనులు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పండుగ ఆచారం ఏంటంటే చెట్టు కొమ్మలతో వీపుపై కొట్టడం. కొట్టుకున్న వారు ఎటువంటి శత్రుత్వం ఉంచుకోకుండా చూసుకోవాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. జడ్జికి షాక్

బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పులపై సుప్రీంకోర్టు స్పందించింది. తీర్పులిచ్చిన మహిళా న్యాయమూర్తి జస్టిస్​ పుష్ప గనేడివాలాకు హైకోర్టులో శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. ఓ కేసులో జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఇంటికి గంగూలీ..

అన్ని వైద్య పరీక్షలు సవ్యంగా ఉంటే గంగూలీని శనివారమే డిశ్చార్జి చేస్తామని అపోలో ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆచార్యతో అజయ్

ఆచార్య సినిమా సెట్‌లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్‌ లొకేషన్​కు వెళ్లిన మంత్రి... మెగాస్టార్​ చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో కాసేపు సరదాగా ముచ్చటించారు. చిత్రబృందానికి, మెగాస్టార్​కు ఆల్ ది బెస్ట్ చెప్తూ... మంత్రి ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఖిలాడి'లో అర్జన్

మాస్ మహారాజ్ రవితేజ కొత్త చిత్రం 'ఖిలాడి'. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించనున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. మహాత్ముని స్మరణ..

హైదరాబాద్​లోని బాపూ ఘాట్​ వద్ద నేతలు నివాళులర్పించారు. గవర్నర్​ సహా మంత్రులు మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ ఆదర్శప్రాయ వ్యక్తిత్వాన్ని నేతలు స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఊరుకోం..

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భద్రాద్రి సీతారామున్ని దర్శించుకున్న మంత్రి.. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.పోరాడతాం..

అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంటకు మద్ధతు ధరతో పాటు బోర్డు ఏర్పాటు చేస్తానన్న భాజపా ఎంపీ అర్వింద్‌ హామీ నిలుపుకోవాలంటూ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విడిగా బతకలేక..

ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసే జీవితాంతం బతికాలని ఆశపడ్డారు. విధి వారిద్దరినీ విడదీసింది. వారి ఆశలను సమాధి చేసింది. తప్పక.. ఇటీవలే ఇద్దరూ వేరేవాళ్లను మనువాడారు. పెళ్లి పీఠలైతే ఎక్కారు.. కానీ వేరేవాళ్లతో జీవితాన్ని పంచుకోలేకపోయారు. పెళ్లి కలవలేకపోయిన వాళ్లు చావుతో ఒక్కటవ్వాలి అనుకున్నారు. ఒకే చున్నీకి కలిసి ఉరేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పడారుపల్లిలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అఖిలపక్షం..

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బడ్జెట్​ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ అజెండాను ఇందులో మోదీ వివరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కొమ్మలతో కొట్టుకోవడం..

బోండా ఘాట్‌లో వింత పండుగ.. 'ఈ జటి పరబ్'​ పండుగను గిరిజనులు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పండుగ ఆచారం ఏంటంటే చెట్టు కొమ్మలతో వీపుపై కొట్టడం. కొట్టుకున్న వారు ఎటువంటి శత్రుత్వం ఉంచుకోకుండా చూసుకోవాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. జడ్జికి షాక్

బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పులపై సుప్రీంకోర్టు స్పందించింది. తీర్పులిచ్చిన మహిళా న్యాయమూర్తి జస్టిస్​ పుష్ప గనేడివాలాకు హైకోర్టులో శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. ఓ కేసులో జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఇంటికి గంగూలీ..

అన్ని వైద్య పరీక్షలు సవ్యంగా ఉంటే గంగూలీని శనివారమే డిశ్చార్జి చేస్తామని అపోలో ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆచార్యతో అజయ్

ఆచార్య సినిమా సెట్‌లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్‌ లొకేషన్​కు వెళ్లిన మంత్రి... మెగాస్టార్​ చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో కాసేపు సరదాగా ముచ్చటించారు. చిత్రబృందానికి, మెగాస్టార్​కు ఆల్ ది బెస్ట్ చెప్తూ... మంత్రి ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఖిలాడి'లో అర్జన్

మాస్ మహారాజ్ రవితేజ కొత్త చిత్రం 'ఖిలాడి'. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించనున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.