ETV Bharat / city

'తొంభై ఏళ్ల తాతయ్య.. కరోనాపై గెలిచాడయ్యా'

author img

By

Published : May 24, 2021, 10:06 AM IST

కరోనా మహమ్మారి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరి మీద బుసలు కొడుతోంది. చిగురుటాకులైన ముసలివాళ్లనే కాదు.. చిరు మొగ్గలను కూడా కొవిడ్ చిదిమేస్తోంది. ఇలాంటి తరుణంలో వయస్సు మీదపడ్డ 90 ఏళ్ల వృద్ధుడు.. కేవలం ఐదు రోజుల్లోనే కరోనాను జయించి.. ఇంటికి చేరుకున్నాడు. వైద్యుల సూచనలు ధైర్యంగా పాటిస్తే.. వైరస్​పై విజయం సాధించొచ్చు అంటూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు.

old man won on corona
కరోనాను జయించిన 90 ఏళ్ల వృద్ధుడు

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 90 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. పట్టణంలోని 30వ వార్డు పార్క్ రోడ్డు 9వ లైనుకు చెందిన బత్తుల వెంకటేశ్వరరావుకు కరోనా సోకింది. వృద్దాప్యంలో కరోనా సోకటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. కొవిడ్19 ఇన్సిడెంట్ కమాండర్ మంగళగిరి తహసీల్దార్ జీవీ రామ్ ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే ఆయన స్పందించి.. ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. వెంకటేశ్వరరావుకు పడకను కేటాయించారు.

వైద్యుల సలహాలు పాటిస్తే కొవిడ్​ను సులువుగా జయించొచ్చు..

ఈ నెల 18న ఎయిమ్స్​లో చేరిన వెంకటేశ్వరరావు.. కేవలం అయిదు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కొవిడ్​ను జయించి ఇంటికి చేరుకున్నారు. వైద్యులు సూచించిన ప్రకారం సమయానికి మందులు, ఆహారం తీసుకున్నానని చెప్పారు. వైరస్ సోకినా భయపడకుండా వైద్యుల సలహాలు పాటిస్తే కొవిడ్​ను సులువుగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. తనకు బెడ్ కేటాయించిన తహసీల్దార్ రామ్ ప్రసాద్ కు, వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి: ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లకు భారీ కొరత.. ఇవి లేకపోతే అంతరాయమే!

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 90 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. పట్టణంలోని 30వ వార్డు పార్క్ రోడ్డు 9వ లైనుకు చెందిన బత్తుల వెంకటేశ్వరరావుకు కరోనా సోకింది. వృద్దాప్యంలో కరోనా సోకటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. కొవిడ్19 ఇన్సిడెంట్ కమాండర్ మంగళగిరి తహసీల్దార్ జీవీ రామ్ ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే ఆయన స్పందించి.. ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. వెంకటేశ్వరరావుకు పడకను కేటాయించారు.

వైద్యుల సలహాలు పాటిస్తే కొవిడ్​ను సులువుగా జయించొచ్చు..

ఈ నెల 18న ఎయిమ్స్​లో చేరిన వెంకటేశ్వరరావు.. కేవలం అయిదు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కొవిడ్​ను జయించి ఇంటికి చేరుకున్నారు. వైద్యులు సూచించిన ప్రకారం సమయానికి మందులు, ఆహారం తీసుకున్నానని చెప్పారు. వైరస్ సోకినా భయపడకుండా వైద్యుల సలహాలు పాటిస్తే కొవిడ్​ను సులువుగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. తనకు బెడ్ కేటాయించిన తహసీల్దార్ రామ్ ప్రసాద్ కు, వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి: ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లకు భారీ కొరత.. ఇవి లేకపోతే అంతరాయమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.