తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక(19)... రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో కలుసుకున్న శ్రీవల్లి రష్మిక... ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రష్మిక విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్... ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రష్మికను శాలువాతో సత్కరించారు.
శ్రీవల్లి రష్మిక... ఈ నెల 21న జాతీయ హార్డ్ కోర్టు ఛాంపియన్గా సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సాధించారు. హరియాణా వేదికగా జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం రెండో సీడ్ రష్మిక 6-2, 7-6 (7/2)తో టాప్ సీడ్ వైదేహి చౌదరి (గుజరాత్)పై విజయం సాధించారు.