సుడిగుండాలతో సతమతం!
కచ్చులూరు వద్ద ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో పాటు సుడిగుండాల కారణంగా బోటు జాడను కనుక్కొనే ప్రయత్నంలో గాలింపు సిబ్బంది విఫలమవుతున్నారు. అది ఏ ప్రాంతంలో ఉందో కనుగొన్నప్పటికీ ఎంత లోతులో ఉందన్న విషయం మాత్రం తెలియరావడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అత్యాధునిక సోనార్ పరికరంతో బోటు మునిగిన ప్రాంతం వద్ద గాలించే ప్రయత్నం చేసినా అది ఎక్కువ లోతులోకి వెళ్లకపోవడం వల్ల బోటు ఎంత లోతులో మునిగి ఉందన్న అంశం మాత్రం తెలియడం లేదు. నౌకాదళానికి చెందిన స్కూబా డైవర్లు సైతం 60 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లగలిగారు. మట్టితో కూడిన నీరు ఉండటంతో అగ్నిమాపక శాఖకు చెందిన విక్టిం లొకేషన్ కెమెరాలు ఎక్కువ లోతులో ఉన్న అంశాలను గుర్తించలేకపోతున్నాయి.
బోటు మునిగిన ప్రాంతంలో ప్రవాహ వేగం 30 నుంచి 40 కి.మీ వేగం ఉండటంతో అక్కడ బోట్లు నిలిపేందుకు సాధ్యపడటం లేదు. ఘటనాస్థలికి దాదాపు 150 మీటర్ల దూరంగా ఉన్న ఇసుక దిబ్బపై నుంచే సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాల్సి వస్తోంది.
ఇవీ చూడండి: బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా?