బంజారాహిల్స్లోని మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక మందగమన పరిస్థితులున్న దృష్ట్యా తక్కువ వడ్డీకే రుణాలు అందే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని స్పీకర్ అన్నారు. మహిళలు ఉపాధి పొందేందుకు సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
ఇవీచూడండి: ఐఏఎస్ అధికారికే టోకరా... కేవైసీ పేరుతో 6లక్షలు స్వాహా