ETV Bharat / city

విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి

author img

By

Published : May 28, 2020, 11:02 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా కశింకోట మండలంలోని జీడి తోటల్లో మిడతలు గుంపులుగా కనిపించాయి. తోటలోని చెట్లపై వాలి ఆకుల్ని తినేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి మిడతలు వచ్చాయనుకొని భయాందోళనకు గురైన రైతు.. అధికారులకు సమాచారమిచ్చాడు.

locust-were-spotted-in-visakha-district of andhra pradesh
విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి
విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి

ఏపీలోని విశాఖ జిల్లా కశింకోట మండలం అచ్చెర్ల శివారు గోకివానిపాలెంలో మిడతల దండు అలజడి స్పష్టించింది. స్థానిక కొండలరావు అనే రైతుకు చెందిన జీడి మామిడి తోటలో భారీగా మిడతలు కనిపించాయి. ఉత్తర భారత్​లో విధ్వంసం స్పష్టిస్తున్న ఎడారి మిడతలు ఇక్కడికి వచ్చాయనుకొని భయపడిన రైతు... అధికారులకు సమాచారం అందించాడు. ఉద్యానవన శాఖ అధికారులు తోటకు చేరుకొని పరిశీలించారు. మిడతలను నిశితంగా పరిశీలించి ఇతర రాష్ట్రాల శాస్త్రవేత్తలకు ఫోటోలు పంపి వివరాలు అడిగారు. అయితే ఇవి గడ్డి మిడతలని... భయపడాల్సిన అవసరం లేదని అనకాపల్లి ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత తెలిపారు.

ఇవీచూడండి: మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!

విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి

ఏపీలోని విశాఖ జిల్లా కశింకోట మండలం అచ్చెర్ల శివారు గోకివానిపాలెంలో మిడతల దండు అలజడి స్పష్టించింది. స్థానిక కొండలరావు అనే రైతుకు చెందిన జీడి మామిడి తోటలో భారీగా మిడతలు కనిపించాయి. ఉత్తర భారత్​లో విధ్వంసం స్పష్టిస్తున్న ఎడారి మిడతలు ఇక్కడికి వచ్చాయనుకొని భయపడిన రైతు... అధికారులకు సమాచారం అందించాడు. ఉద్యానవన శాఖ అధికారులు తోటకు చేరుకొని పరిశీలించారు. మిడతలను నిశితంగా పరిశీలించి ఇతర రాష్ట్రాల శాస్త్రవేత్తలకు ఫోటోలు పంపి వివరాలు అడిగారు. అయితే ఇవి గడ్డి మిడతలని... భయపడాల్సిన అవసరం లేదని అనకాపల్లి ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత తెలిపారు.

ఇవీచూడండి: మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.