హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి కదిలింది. మహాగణపతి శోభాయత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం కల్లా మహాగణపతి నిమజ్జనం పూర్తి కానుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక క్రేన్ సిద్ధం చేశారు. ఎన్టీఆర్ మార్గ్లోని విగ్రహాలను అధికారులు ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తున్నారు.
మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. నిమజ్జనం వేడుకలను చూసేందుకు వస్తున్న ప్రజలు... వ్యక్తిగత వాహనాలపై రావొద్దని పోలీసులు సూచిస్తున్నాయి. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో రావడం మంచిదన్నారు.
ఇదీ చూడండి : రవాణాశాఖ నిర్ణయించిన ధరకే నిమజ్జన వాహనాలు...!