సీఎంగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు భూసంస్కరణలు అమలు చేశారని ఎంపీ కేశవరావు అన్నారు. నవోదయ విద్యాలయాలను తీసుకువచ్చిన ఘనత పీవీదే అని కొనియాడారు. పేదలకు సమాజంలో గౌరవం, ఆత్మగౌరవం తీసుకువచ్చారని అన్నారు.
ఆర్థిక సుస్థిరతకు ఆయన అందించిన నాయకత్వం సదా స్మరణీయంమని పేర్కొన్నారు. బీసీల్లో రాజకీయ చైతన్యం, సాధికారత తెచ్చారని వివరించారు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొని నివాళులర్పించి, ప్రసంగించారు.
ఇదీ చూడండి : పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్