కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చిందని సీఎం వెల్లడించారు. ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. లోకల్ కేడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం చేసిందని పేర్కొన్నారు. ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దీని ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు: కేసీఆర్
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో... కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు చేపడుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చిందని వెల్లడించారు.
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చిందని సీఎం వెల్లడించారు. ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. లోకల్ కేడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం చేసిందని పేర్కొన్నారు. ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దీని ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
TAGGED:
JOBS