ఆ ప్రాంతాలపై దృష్టిపెట్టండి
మలేరియా, డెంగీ కేసులు అధికంగా నమోదయ్యే హయత్నగర్, మలక్పేట్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, అంబర్పేట్, మూసాపేట్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో దోమల నివారణ స్ప్రేయింగ్ చేపట్టాలని, నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అవగాహన కల్పించాలి
ఓవర్హెడ్ ట్యాంక్లు, సంప్లు, నల్లా గుంతలతో పాటు డ్రమ్లు, టైర్లలో నీటి నిల్వలను పూర్తిగా తొలగించాలన్నారు. నగరంలోని 1800 పాఠశాలల విద్యార్థులకు అంటు వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ప్రతిరోజు కనీసం 150 కాలనీలు, బస్తీల్లో ఫాగింగ్ నిర్వహించాలని కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు.
ఇవీ చూడండి: ఆరోగ్య గ్రామాల ఏర్పాటే లక్ష్యం: హరీశ్ రావు