లాక్డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. కానీ శనివారం మధ్యాహ్నం 2 నుంచి ఐదున్నర వరకు వైన్స్లు తెరవనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఓ నకిలీ ఉత్తర్వు సర్క్యూలేట్ అయింది. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీపీ రాజేంద్ర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆబ్కారీ శాఖ నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు తెలిపారు. తమ శాఖ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఆర్డర్ కాపీ నకిలీదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. దానిని సృష్టించిన వారిని కఠినంగా శిక్షించాలని సీసీఎస్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: క్వారంటైన్ వ్యక్తులు బయట తిరిగితే జైలుకే..