క్వారంటైన్ వ్యక్తులు బయట తిరిగితే జైలుకు పంపుతామని మంత్రి ఈటల హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందన్నారు.
హైదరాబాద్లో ఎక్కడా రెడ్జోన్లు లేవని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రార్థనా మందిరాలకు ప్రజలు వెళ్లవద్దని మంత్రి కోరారు. దిల్లీలో ప్రార్థనా మందిరానికి వెళ్లి వచ్చిన వ్యక్తికే వైరస్ సోకిందని వెల్లడించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు