ETV Bharat / city

సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీపై ఈసీ అభ్యంతరం - telangana latest news

ఎన్నికల కోడ్​ అమల్లో ఉండగా సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కావడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ ఎన్నికల కన్వీనర్ ఫిర్యాదుపై స్పందించిన రిటర్నింగ్​ అధికారి.. ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీచేశారు.

ec notice to NGOs in telangana
సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీపై ఈసీ అభ్యంతరం
author img

By

Published : Mar 17, 2021, 1:52 PM IST

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు భేటీ కావడం పట్ల ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్​-రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి ప్రియాంక.. ఉద్యోగ సంఘాలకు ఈనెల 15న నోటీసులు జారీ చేశారు. 24 గంటల లోపల సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ec notice to NGOs in telangana
ఈసీ జారీచేసిన నోటీసులు

ఫిర్యాదు ఏంటి..?

టీపీసీసీ ఎన్నికల కన్వీనర్ నిరంజన్... ఈ నెల 9న రిట్నరింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్​తో సమావేశమైన అనంతరం పీఆర్సీపై మీడియాతో మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 29 శాతం ఫిట్​మెంట్ ఇస్తామని, పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని.. ఇతర సమస్యలను పరిష్కరించడానికి సీఎం సుముఖంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో చెప్పడం వల్ల... తెరాస అభ్యర్థి వాణిదేవికి పట్టభద్రుల ఎన్నికల్లో అనుకూలంగా వ్యవహరించినట్లైందని నిరంజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీ చేశారు.

ఉద్యోగ సంఘాలు ఏమన్నాయ్​..

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ ఉద్యోగ సంఘాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరణ కోరారు. సాధారణంగానే ముఖ్యమంత్రితో భేటీ అయ్యామని ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల కమిషన్​కు సమాధానమిచ్చాయి. ఉద్యోగుల సమస్యలపై చర్చించామని.. బడ్జెట్​తో పాటు... ఇతర సమస్యలను సీఎంతో చర్చించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల కమిషన్​కు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నాయి.

ఇవీచూడండి: కౌంటింగ్​ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది: కోదండరాం

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు భేటీ కావడం పట్ల ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్​-రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి ప్రియాంక.. ఉద్యోగ సంఘాలకు ఈనెల 15న నోటీసులు జారీ చేశారు. 24 గంటల లోపల సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ec notice to NGOs in telangana
ఈసీ జారీచేసిన నోటీసులు

ఫిర్యాదు ఏంటి..?

టీపీసీసీ ఎన్నికల కన్వీనర్ నిరంజన్... ఈ నెల 9న రిట్నరింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్​తో సమావేశమైన అనంతరం పీఆర్సీపై మీడియాతో మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 29 శాతం ఫిట్​మెంట్ ఇస్తామని, పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని.. ఇతర సమస్యలను పరిష్కరించడానికి సీఎం సుముఖంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో చెప్పడం వల్ల... తెరాస అభ్యర్థి వాణిదేవికి పట్టభద్రుల ఎన్నికల్లో అనుకూలంగా వ్యవహరించినట్లైందని నిరంజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీ చేశారు.

ఉద్యోగ సంఘాలు ఏమన్నాయ్​..

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ ఉద్యోగ సంఘాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరణ కోరారు. సాధారణంగానే ముఖ్యమంత్రితో భేటీ అయ్యామని ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల కమిషన్​కు సమాధానమిచ్చాయి. ఉద్యోగుల సమస్యలపై చర్చించామని.. బడ్జెట్​తో పాటు... ఇతర సమస్యలను సీఎంతో చర్చించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల కమిషన్​కు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నాయి.

ఇవీచూడండి: కౌంటింగ్​ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.