ETV Bharat / city

పాజిటివ్‌ రోగుల తరలింపు బస్సుల్లోనా...?

author img

By

Published : Jul 23, 2020, 9:46 AM IST

కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయిన వారి తరలింపు వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. ఏపీలోని విశాఖ ఎంవీపీకాలనీ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన 24 మందిని తితిదే కల్యాణ మండపం కూడలికి తీసుకొచ్చారు.

covid-patients-are-carried-in-bus-at-vishakapatnam
పాజిటివ్‌ రోగుల తరలింపు బస్సుల్లోనా...?

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి తరలింపు వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్నంలోని ఎంవీపీకాలనీ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన 24 మందిని తితిదే కల్యాణ మండపం కూడలికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బందిగానీ, రోగులుగానీ కనీస రక్షణ దుస్తులు ధరించలేదు. రోగులను పెద్ద సంఖ్యలో జనసంచారం ఉన్న ప్రాంతాలకు తీసుకొచ్చి కొంతసేపు ఉంచారు. తర్వాత అక్కడకు బస్సులు చేరుకోవటంతో వాటిలో మారికవలసకు తరలించారు. పాజిటివ్‌ రోగులను తరలింపులో కనీస జాగ్రత్తలు పాటించకపోవటంతో కాలనీవాసులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యం కూడలిలో కూడా బస్సుల్లోనే పాజిటివ్‌ రోగులను తరలించారు. ఇలా చేయటం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని.. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి తరలింపు వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్నంలోని ఎంవీపీకాలనీ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన 24 మందిని తితిదే కల్యాణ మండపం కూడలికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బందిగానీ, రోగులుగానీ కనీస రక్షణ దుస్తులు ధరించలేదు. రోగులను పెద్ద సంఖ్యలో జనసంచారం ఉన్న ప్రాంతాలకు తీసుకొచ్చి కొంతసేపు ఉంచారు. తర్వాత అక్కడకు బస్సులు చేరుకోవటంతో వాటిలో మారికవలసకు తరలించారు. పాజిటివ్‌ రోగులను తరలింపులో కనీస జాగ్రత్తలు పాటించకపోవటంతో కాలనీవాసులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యం కూడలిలో కూడా బస్సుల్లోనే పాజిటివ్‌ రోగులను తరలించారు. ఇలా చేయటం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని.. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.