ETV Bharat / city

'కొవిడ్​ను తరిమికొట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్ప మరోమార్గం లేదు'

author img

By

Published : Mar 30, 2021, 10:23 PM IST

కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సినేషన్ తప్ప మరోమార్గం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇప్పుడు సాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ప్లాట్లు విక్రయించేందుకు భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు.

cm jagan, ap, scheemes review
ముఖ్యమంత్రి జగన్, ఏపీ , స్పందన

'స్పందన' కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. మహమ్మారి కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు వార్డు, గ్రామ సచివాలయాల యూనిట్‌గా టీకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. గురువారం తాను కూడా వ్యాక్సిన్ వేయించుకోనున్నట్లు సీఎం తెలిపారు. పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యాక కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించాలని నిర్దేశించారు.

'కొవిడ్‌ను ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. ఇప్పుడు సాగుతున్న టీకాల కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి. గ్రామసచివాలయం, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని.. వాలంటీర్లు, ఆశాకార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. ఫలానా రోజు వైద్యులు టీకా వేయడానికి వస్తారని వారికి చెప్పడమే గాక...మిగిలిన సిబ్బంది మొత్తం అదేరోజు ఆ గ్రామంలోనే ఉండి సచివాలయం వద్ద అందరికీ వ్యాక్సిన్ వేయించాలి. ఇలా చేస్తే తప్ప మరోమార్గం లేదు.' అని సీఎం జగన్ అన్నారు.

ఉపాధిహామీ పనులపై చర్చించిన సీఎం.. ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరగాలని ఆదేశించారు. పనులను రికార్డు స్థాయిలో చేపట్టారని అభినందించారు. 25.50 కోట్ల పని దినాలను తద్వారా 5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్కులు తదితరవాటి భవన నిర్మాణాలు వేగంగా జరగాలని అధికారులకు సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనకబడ్డాయని ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి మే నెల వరకు పూర్తి చేయాలన్నారు.

ఆగస్టు 15న విలేజ్ క్లినిక్​లు ప్రారంభించాలి: సీఎం జగన్​

బీఎంసీల పనులు పూర్తి చేయాలి

రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. 9,899 చోట్ల బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల (బీఎంసీల)ను ఏర్పాటు చేయాల్సి ఉందని, 3,841 చోట్ల పనులు మొదలయ్యాయన్నారు. మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలుకావాలని ఆగస్టు 31 కల్లా బీఎంసీల పనులు పూర్తి చేయాలని సెప్టెంబర్​లో వీటిని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెట్టబోతున్నామన్న సీఎం.. దీనికోసం భూములను గుర్తించి.. అక్కడ యూనిట్లను పెట్టించాలన్నారు.

90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలి

పేదలకు ఇళ్లు ఇళ్లపట్టాలు అంశంపై అధికారులతో సీఎం చర్చించారు. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులని తేలితే 90 రోజుల్లోగా వారికి ఇంటిపట్టా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 94 శాతం ఇళ్లపట్టాల పంపిణీ పూర్తైందని మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలన్నారు. అలాగే టిడ్కోలో పంపిణీ చేయాల్సి ఉన్న సుమారు 47 వేల ఇళ్ల పట్టాలను వెంటనే పూర్తిచేయాలన్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసమైన చోట వెంటనే భూమిని సేకరించాలన్నారు. ఇళ్లపట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో చెప్పగలగాలని, కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించరాదన్నారు.

క్లీన్​ టైటిల్​తో ఇళ్ల స్థలాలు

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కింద తొలివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామన్న సీఎం.. తొలివిడతలో 8,682 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. ఇళ్లనిర్మాణం జరగడానికి వీలుగా లే అవుట్‌లో బోరు, కరెంటు సౌకర్యం ఉండాలని, ప్రతిచోటా బోరు, కరెంటు సౌకర్యం కచ్చితంగా ఉండాలన్నారు. ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. హౌసింగ్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మున్సిపాలిటీకి నోడల్‌ అధికారులుగా నియమించాలని సూచించారు. ప్రతి లే అవుట్‌లో కచ్చితంగా ఒక మోడల్‌ హౌస్‌ను నిర్మించాలన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న సీఎం.. న్యాయపరంగా చిక్కుల్లేని విధంగా క్లీన్‌ టైటిల్‌తో ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు.

అర్హులైన వారందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇళ్లనిర్మాణం చేపట్టుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఉపాధిహామీ పనులు రికార్డు స్థాయిలో చేపట్టినందుకు అభినందించిన జగన్.. మే నాటికి సచివాలయాల నిర్మాణం పూర్తికావాలన్నారు. పట్టణాల్లో తక్కువ ధరకే మధ్యతరగతి వారికి స్థలాలు ఇచ్చేందుకు లాభాపేక్ష లేని విధంగా వివాదం లేని భూములు కొనుగోలు చేయాలని సూచించారు.

కార్పొరేషన్లు, కమిషనర్లు డిమాండ్‌కు అనుగుణంగా భూమి కొనుగోలుపై దృష్టిసారించాలి. మూడురకాల ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. 150, 200, 240 చ.గజాలు ఫ్లాట్లు తీసుకురానున్నాం. ఈ ఫ్లాట్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉండనున్నాయి. ప్రభుత్వానికి ఎలాంటి లాభాపేక్ష లేదు. కొనుగోలు చేసే భూముల్లో ఎలాంటి వివాదాలు ఉండరాదు.

- వైఎస్​ జగన్మోహన్​రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి

నాడు-నేడు పనులపైనా సీఎం సమీక్షించారు. స్పందన దరఖాస్తులను వందశాతం పరిష్కరించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బోధనా ఫీజుల బకాయిలు పూర్తిగా విడుదల చేశామని జగన్‌ వివరించారు.

ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం

'స్పందన' కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. మహమ్మారి కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు వార్డు, గ్రామ సచివాలయాల యూనిట్‌గా టీకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. గురువారం తాను కూడా వ్యాక్సిన్ వేయించుకోనున్నట్లు సీఎం తెలిపారు. పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యాక కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించాలని నిర్దేశించారు.

'కొవిడ్‌ను ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. ఇప్పుడు సాగుతున్న టీకాల కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి. గ్రామసచివాలయం, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని.. వాలంటీర్లు, ఆశాకార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. ఫలానా రోజు వైద్యులు టీకా వేయడానికి వస్తారని వారికి చెప్పడమే గాక...మిగిలిన సిబ్బంది మొత్తం అదేరోజు ఆ గ్రామంలోనే ఉండి సచివాలయం వద్ద అందరికీ వ్యాక్సిన్ వేయించాలి. ఇలా చేస్తే తప్ప మరోమార్గం లేదు.' అని సీఎం జగన్ అన్నారు.

ఉపాధిహామీ పనులపై చర్చించిన సీఎం.. ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరగాలని ఆదేశించారు. పనులను రికార్డు స్థాయిలో చేపట్టారని అభినందించారు. 25.50 కోట్ల పని దినాలను తద్వారా 5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్కులు తదితరవాటి భవన నిర్మాణాలు వేగంగా జరగాలని అధికారులకు సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనకబడ్డాయని ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి మే నెల వరకు పూర్తి చేయాలన్నారు.

ఆగస్టు 15న విలేజ్ క్లినిక్​లు ప్రారంభించాలి: సీఎం జగన్​

బీఎంసీల పనులు పూర్తి చేయాలి

రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. 9,899 చోట్ల బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల (బీఎంసీల)ను ఏర్పాటు చేయాల్సి ఉందని, 3,841 చోట్ల పనులు మొదలయ్యాయన్నారు. మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలుకావాలని ఆగస్టు 31 కల్లా బీఎంసీల పనులు పూర్తి చేయాలని సెప్టెంబర్​లో వీటిని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెట్టబోతున్నామన్న సీఎం.. దీనికోసం భూములను గుర్తించి.. అక్కడ యూనిట్లను పెట్టించాలన్నారు.

90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలి

పేదలకు ఇళ్లు ఇళ్లపట్టాలు అంశంపై అధికారులతో సీఎం చర్చించారు. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులని తేలితే 90 రోజుల్లోగా వారికి ఇంటిపట్టా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 94 శాతం ఇళ్లపట్టాల పంపిణీ పూర్తైందని మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలన్నారు. అలాగే టిడ్కోలో పంపిణీ చేయాల్సి ఉన్న సుమారు 47 వేల ఇళ్ల పట్టాలను వెంటనే పూర్తిచేయాలన్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసమైన చోట వెంటనే భూమిని సేకరించాలన్నారు. ఇళ్లపట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో చెప్పగలగాలని, కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించరాదన్నారు.

క్లీన్​ టైటిల్​తో ఇళ్ల స్థలాలు

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కింద తొలివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామన్న సీఎం.. తొలివిడతలో 8,682 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. ఇళ్లనిర్మాణం జరగడానికి వీలుగా లే అవుట్‌లో బోరు, కరెంటు సౌకర్యం ఉండాలని, ప్రతిచోటా బోరు, కరెంటు సౌకర్యం కచ్చితంగా ఉండాలన్నారు. ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. హౌసింగ్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మున్సిపాలిటీకి నోడల్‌ అధికారులుగా నియమించాలని సూచించారు. ప్రతి లే అవుట్‌లో కచ్చితంగా ఒక మోడల్‌ హౌస్‌ను నిర్మించాలన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న సీఎం.. న్యాయపరంగా చిక్కుల్లేని విధంగా క్లీన్‌ టైటిల్‌తో ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు.

అర్హులైన వారందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇళ్లనిర్మాణం చేపట్టుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఉపాధిహామీ పనులు రికార్డు స్థాయిలో చేపట్టినందుకు అభినందించిన జగన్.. మే నాటికి సచివాలయాల నిర్మాణం పూర్తికావాలన్నారు. పట్టణాల్లో తక్కువ ధరకే మధ్యతరగతి వారికి స్థలాలు ఇచ్చేందుకు లాభాపేక్ష లేని విధంగా వివాదం లేని భూములు కొనుగోలు చేయాలని సూచించారు.

కార్పొరేషన్లు, కమిషనర్లు డిమాండ్‌కు అనుగుణంగా భూమి కొనుగోలుపై దృష్టిసారించాలి. మూడురకాల ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. 150, 200, 240 చ.గజాలు ఫ్లాట్లు తీసుకురానున్నాం. ఈ ఫ్లాట్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉండనున్నాయి. ప్రభుత్వానికి ఎలాంటి లాభాపేక్ష లేదు. కొనుగోలు చేసే భూముల్లో ఎలాంటి వివాదాలు ఉండరాదు.

- వైఎస్​ జగన్మోహన్​రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి

నాడు-నేడు పనులపైనా సీఎం సమీక్షించారు. స్పందన దరఖాస్తులను వందశాతం పరిష్కరించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బోధనా ఫీజుల బకాయిలు పూర్తిగా విడుదల చేశామని జగన్‌ వివరించారు.

ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.