ETV Bharat / city

కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదు: లక్ష్మణ్

author img

By

Published : Oct 30, 2019, 7:53 PM IST

Updated : Oct 30, 2019, 8:09 PM IST

ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కార్మికులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. ఆర్టీసీపై కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు.

హైకోర్టు.. చినజీయర్​ అక్షింతలు ఒకటేనా..:లక్ష్మణ్​
హైకోర్టు.. చినజీయర్​ అక్షింతలు ఒకటేనా..:లక్ష్మణ్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసే ప్రకటనలు ఆర్టీసీ కార్మికులపై కొంచెం ప్రభావం కూడా చేయలేకపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోవడం లేదన్నారు. చినజీయర్​ స్వామి అక్షింతలు.. హైకోర్టు అక్షింతలు ఒకటేనని కేసీఆర్​ భావిస్తున్నారని లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందని.. ఈ అంశంపై కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు.

ఇవీచూడండి: ఆర్టీసీ సమ్మెకు అన్నివర్గాల మద్దతు: కోదండరాం

హైకోర్టు.. చినజీయర్​ అక్షింతలు ఒకటేనా..:లక్ష్మణ్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసే ప్రకటనలు ఆర్టీసీ కార్మికులపై కొంచెం ప్రభావం కూడా చేయలేకపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోవడం లేదన్నారు. చినజీయర్​ స్వామి అక్షింతలు.. హైకోర్టు అక్షింతలు ఒకటేనని కేసీఆర్​ భావిస్తున్నారని లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందని.. ఈ అంశంపై కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు.

ఇవీచూడండి: ఆర్టీసీ సమ్మెకు అన్నివర్గాల మద్దతు: కోదండరాం

TG_Hyd_38_30_BJP_On_CM_KCR_AB_3182400 Reporter: Nagarjuna Script: Razaq Note: ఫీడ్ భాజపా కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చేసే భయానక ప్రకటనలు ఆర్టీసీ కార్మికులపై కించిత్తు ప్రభావం చూపలేకపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. హైకోర్టు అక్షింతలు వేసినా... సీఎం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామి అక్షింతలు, కోర్టు వేసే అక్షింతలు ఒకటేనని సీఎం అనుకుంటున్నారని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెపై ఒక వైపు కోర్టులో విచారణ జరుగుతుంటే రూట్లను ప్రైవేట్ చేస్తున్నామని లీకులు ఇస్తూ...కార్మికులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తే తిరుగుబాటు తప్పదని లక్ష్మణ్ హెచ్చరించారు. కేంద్ర వాటా 31 శాతం ఉందని ఆర్టీసీ చెప్పిందని, ఈ విషయంలో కేంద్రాన్ని కలుస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె విషయం కేంద్రానికి పార్టీ పరంగా,గవర్నర్ పరంగా వెళ్తోందని చెప్పారు. గ్రామ పంచాయతీ లో ఉన్న ముగ్గురు పిల్లల నిబంధన పట్టణాలకు వచ్చే సరికి ఎందుకు లేదని ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు తమకు సెమి ఫైనల్‌ అని, ...వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్‌ గా ఆయన పేర్కొన్నారు. తాము 17పార్లమెంట్ స్థానాల్లో గాంధీ సంకల్ప యాత్రలు చేపడితే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బైట్: లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Last Updated : Oct 30, 2019, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.