నేటి తరం తెలుగు సంప్రదాయాన్ని మర్చిపోతోందని, వాటిని ఈ తరానికి అందించాల్సిన అవసరం ఉందని మహిళా పారిశ్రామికవేత్త పద్మజా రాణి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అపొర్టబుల్ పేరిట ఏర్పాటు చేసిన చిత్రకళాప్రదర్శలో పాల్గొన్నారు.
చిత్రకళ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి అందిచ్చవచ్చని పద్మజా రాణి తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన నిధిలో కొంత పేద విద్యార్థుల కోసం వినియోగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
- ఇదీ చూడండి: 'అమెరికా కోడి కాలు పెడితే భారత పరిశ్రమ మటాష్'